మైదానంలో యువకులతో క్రికెట్ ఆడిన జననేత విజ్జన్న.
పెద్దపల్లి,నవంబర్17(కలం శ్రీ న్యూస్): పెద్దపల్లి పట్టణంలోని ఐ.టి.ఐ ప్రభుత్వ కళాశాల మైదానంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయరమణ రావు శుక్రవారం ఉదయం వాకర్ల తో మార్నింగ్ వాకింగ్ చేశారు. మైదానంలో ఆయన్ని చూసిన వాకర్లు అత్మీయంగా పలకరిస్తూ అలింగనం చేసుకున్నారు. అనంతరం యువకులతో కలిసి కాసేపు క్రికెట్ ఆడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…పెద్దపల్లి పట్టణాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే దిశగా అడుగులు వేద్దామని అన్నారు.పెద్దపల్లి నియోజకవర్గాన్ని ఈ ఎమ్మెల్యే మొత్తం దోచుకోవడం తప్ప అభివృద్ధి చేయలేదని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే భాద్యతను తీసుకుంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి , మీ విజ్జన్నకి అవకాశం ఇవ్వాలని ఓటు వేసి ఆశీర్వదించగలరని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు,వాకర్స్, యువకులు, తదితరులు పాల్గొన్నారు.