Saturday, July 27, 2024
Homeతెలంగాణఆరు గ్యారెంటీ లేని పథకాలతో మభ్యపెడ్తున్న కాంగ్రెస్‌

ఆరు గ్యారెంటీ లేని పథకాలతో మభ్యపెడ్తున్న కాంగ్రెస్‌

ఆరు గ్యారెంటీ లేని పథకాలతో మభ్యపెడ్తున్న కాంగ్రెస్‌

మున్సిపల్‌ చైర్‌ పర్సన్‌ పుట్ట శైలజ

మంథని,నవంబర్16(కలం శ్రీ న్యూస్):బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రవేశపెట్టిన ఎన్నికల మేనీఫెస్టో ప్రతి కుటుంబానికి భరోసా కల్పిస్తుందని మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పుట్ట శైలజ  అన్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం రాత్రి సెంటనరీకాలనీ జోన్‌ 1లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి తిరుగుతూ మహిళలకు బొట్టుపెట్టి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పథకాలు, ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధూకర్‌ చేసిన సేవలను వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు.అనేక ఏండ్లు కాంగ్రెస్‌ పాలనలో గోసపడ్డామని,గత ఎన్నికల్లో ఆలోచన చేయకుండా కాంగ్రెస్‌కు ఓటు వేసి ఐదేండ్ల అభివృధ్దిని కోల్పోయామని ఆమె అన్నారు. సంక్షేమం అభివృద్ది సేవలు బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలోనే ఉంటాయని,మంథనిఎమ్మెల్యేగా పుట్ట మదూకర్‌  ప్రభుత్వ సంక్షేమ ఫలాలతో పాటు, తన తల్లి పేరున స్థాపించిన ట్రస్టు ద్వారా అనేక సేవలు చేశారన్నారు. అన్నంపెట్టి ఆకలి తీర్చిన పుట్ట మదూకర్‌ ని ఆదరించి ఆశీర్వదించాలని, భవిష్యత్‌ తరాల బాగుకే పుట్ట మధూకర్‌  ఆరాటమని ఆమె వివరించారు. ఈనాడు ఎన్నికలు వచ్చాయని ఆరు గ్యారెంటీ లేని పథకాలతో మనల్ని మరోసారి మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, కాంగ్రెస్సోల్ల మాటలు నమ్మి మోపపోయి గోసపడవద్దని ఆమె సూచించారు. మంథని మట్టిబిడ్డగా పుట్ట మధూకర్‌  కారు గుర్తు ఓటేసి గెలిపించాలని ఆమె కోరారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!