Sunday, December 10, 2023
Homeతెలంగాణబీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం

బీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం

బీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం

మంథని,అక్టోబర్26(కలం శ్రీ న్యూస్):బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. మంథని నియోజకవర్గానికి చెందిన ఆయా మండలాల్లోని కాంగ్రెస్‌ బీజేపీ శ్రేణులు ఆ పార్టీలను వీడి బీఆర్‌ఎస్‌లోకి చేరుతున్నారు. ఇటీవలి కాలంలో మంథని, ముత్తారం, మల్హర్‌, కాటారం మండలాలకు చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. తాజాగా మహముత్తారం మండలంలోని పలు గ్రామాలకు చెందిన సుమారు 200 నాయకులు,కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరారు. మంథని భీ ఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌, భూపాల పల్లి జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్  సమక్షంలో పార్టీలో చేరగా, వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ప్రభుత్వం, సీఎం కేసీఆర్‌ చేస్తున్న అభివృధ్ది, సంక్షేమ పథకాల అమలుతో పాటు నియోజకవర్గంలో జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌ చేస్తున్న సేవలకు ఆకర్షితులై ఆయనకు అండగా నిలువాలని బీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. నియోజకవర్గ అభివృధ్ది, ఈ ప్రాంతంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తున్న జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌కు అండగా నిలిచి ఆయన గెలుపుకోసం తమవంతు సహకారం అందిస్తామని ఈసందర్బంగా వారు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో మంథని గడ్డపై గులాభీజెండా ఎగురడం, మధన్న గెలుపు ఖాయమని వారు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!