Saturday, July 27, 2024
Homeతెలంగాణబీజేపీ పార్టీ గెలుపుకు రోజురోజుకి పెరుగుతున్న చేరికలే నిదర్శనం.

బీజేపీ పార్టీ గెలుపుకు రోజురోజుకి పెరుగుతున్న చేరికలే నిదర్శనం.

బీజేపీ పార్టీ గెలుపుకు రోజురోజుకి పెరుగుతున్న చేరికలే నిదర్శనం.

బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి 

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని అక్టోబర్ 14(కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బీజేపీ పార్టీ ఆఫీస్ లో శనివారం మంథని మండలం బిట్టుపల్లి,మల్హర్ మండలం మల్లారం,ముత్తారం మండలం మచ్చుపేట,లక్కారం గ్రామాలకు చెందిన సుమారు 300 మంది మహిళాలు,యువత బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీ లో చేరారు.వీరికి సునీల్ రెడ్డి కండువాలు వేసి పార్టీ లోకి ఆహ్వానించారు.అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ..రోజు రోజుకి బీజేపీ పార్టీ లో చేరికలే మంథని లో బీజేపీ పార్టీ గెలుపుకి నిదర్శనం అని శ్రీధర్ బాబు,పుట్ట మధుల పాలనపై విరక్తి చెంది ఈరోజు బిజెపి పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలు భావిస్తున్నారని, మహిళలు చైతన్యవంతులై, యువకులు ఓ కొత్త రాజకీయానికి నాంది పలుకుతున్నారు.రానున్న కాలంలో బిజెపి పార్టీకి ప్రజలు పట్టడం కడతారని రాష్ట్రంలో ఒక రాక్షస పాలన టిఆర్ఎస్ కొనసాగిస్తుందని కొద్ది రోజుల క్రితం అప్పుల బాధతో నెల్లిపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు దంపతులు ఆత్మహత్య చేసుకొని చనిపోవడం తీవ్ర బాధాకరం,ఈ ఘటన మరువక ముందే నిన్న రాత్రి వరంగల్ జిల్లాకు చెందిన ప్రవళిక ఉద్యోగ నోటిఫికేషన్ వేసి పరీక్షలు వాయిదా వేయడంతో మనస్థాపంతో ఉరివేసుకొని మరణించిందని,యువతను,మహిళలను ఇన్ని రకాలుగా హింస పెడుతున్న బీఆర్ఎస్ రాక్షస పాలనను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మల్క మోహన్ రావు, జిల్లా అధికార ప్రతినిధి పోతర వేణి క్రాంతి కుమార్,పలు మండలాల అధ్యక్షులు వీరబోయిన రాజేందర్,పెయ్యల కుమార్,మండల ఇంచార్జ్ తోట మధుకర్,మండల ప్రధాన కార్యదర్శిలు ఆరె ఓదెలు,అమ్ము శ్రీనివాస్,మహిళ మోర్చా మండల అధ్యక్షురాలు బోసెల్లి మౌనిక, నాయకురాలు కండె సౌమ్య, సీనియర్ నాయకులు రేపాక శంకర్,కోరబోయిన మల్లిక్, లైసెట్టిబాబు,లింగన్నపేట అశోక్, నూకల మహేందర్,తోట నాగరాజు,బోసెల్లి శంకర్,కాసిపేట మల్లేష్,కురుమ శేఖర్,బుర్ర రాజు,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!