Saturday, July 27, 2024
Homeతెలంగాణముఖ్య మంత్రి అల్పాహార పథకం సందర్శించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 

ముఖ్య మంత్రి అల్పాహార పథకం సందర్శించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 

ముఖ్య మంత్రి అల్పాహార పథకం సందర్శించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ 

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్ 

మంథని అక్టోబర్ 12( కలం శ్రీ న్యూస్):ముఖ్యమంత్రి అల్పాహార పథక కార్యక్రమం పర్యవేక్షణ కోసం జిల్లా పాలనాధికారి ముజమ్మిల్ ఖాన్ గురువారం మంథని మండలం కాకర్ల పల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలను సందర్శించారు.చేతుల పరిశుభ్రత గురించి వివరించి,పిల్లలతో కలిసి టిఫిన్ చేశారు. ఈ రోజు అల్ఫహరం పొంగల్, సాంబార్ బాగుందని,పిల్లల ఎదుగుదలకు ఉదయం టిఫిన్ అవసరం అని, బాగా చదవాలని సూచించారు. శివాని అనే విద్యార్థిని ఐపిఎస్ కావాలని ఉందని చెప్పడంతో, బాగా చదుకోవాలని సూచించారు. పిల్లలతో పాటు నేల మీదనే కూర్చొని వానదేవుడా పాటను పిల్లలతో కలిసి పాడారు.పాఠశాల పరిస్థితిని సర్పంచ్ పద్మ కొమురయ్య వివరించగా మన ఊరు మన బడి ప్రపోజల్ చేద్దామని అన్నారు.ఉన్నతి కార్యక్రమం అమలు తీరు తెన్నులను జిల్లా విద్యాధికారి డి. మాధవి బాలికల ఉన్నత పాఠశాలను,తొలిమెట్టు కార్యక్రమం గురించి తెనుగువాడ పాఠశాలను సందర్శించి పలు సూచనలు చేశారు.ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి దాసరి లక్ష్మి ,ఐసిడిఎస్ సీడీపీఓ పద్మశ్రీ, సీపీఆర్ స్వప్న,ప్రధానోపాధ్యాయులు కోట లక్ష్మణ్,సహోపాధ్యాయుల రమేష్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!