Wednesday, November 29, 2023
Homeతెలంగాణకాంగ్రెస్ నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మవద్దు

కాంగ్రెస్ నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మవద్దు

కాంగ్రెస్ నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మవద్దు

సుల్తానాబాద్, అక్టోబర్ 12(కలం శ్రీ న్యూస్): పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని చిన్నకల్వల గ్రామంలో ఇంటింటి ప్రచారం చేస్తున్న గ్రామ సర్పంచ్ ఏరుకొండ రమేష్ వచ్చే ఎన్నికల్లో దాసరి మనోహర్ రెడ్డి ని భారీ మెజారిటీతో కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని ఇంటింటికి ప్రచారం చేస్తూ గ్రామ ప్రజలను కోరారు. కాంగ్రెస్ నాయకులు చెప్పే కల్లబొల్లి మాటలు నమ్మద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గుర్రం సంపత్ గౌడ్, సుల్తానాబాద్ మండలం కన్వీనర్ కృష్ణారావు, గ్రామ శాఖ అధ్యక్షులు గుర్రం భూమయ్య గౌడ్, ఉప సర్పంచ్ అరుణమొండయ్య, మాజీ సర్పంచ్ కల్వల నారాయణ, బిఆర్ఎస్ సీనియర్ నాయకులు గుర్రం శ్రీనివాస్ గౌడ్, గుర్రం అంజయ్య, సుక్క మొగిలి, గుర్రం సత్తయ్య, కిష్టయ్య, వార్డ్ నెంబర్లు ఏరుకొండ తిరుపతి, ఎలువాక కుమార్, సంజీవ్, బిఆర్ఎస్ యూత్ నాయకులు గుర్రం హరీష్, ఎస్సీ సెల్ యూత్ ఉపాధ్యక్షులు శ్రవణ్, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!