Saturday, July 27, 2024
Homeతెలంగాణమంథనిలో మహిళా దారుణ హత్య

మంథనిలో మహిళా దారుణ హత్య

మంథనిలో మహిళా దారుణ హత్య

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్ 

మంథని సెప్టెంబర్ 11 (కలం శ్రీ న్యూస్): మంథని మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన రేషన్ డీలర్ బందెల రాజామణి (37) అనే వివాహిత హత్యకు గురైన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే మంథని మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన బందెల రాజమణి అనే వివాహిత భర్త గత నాలుగు సంవత్సరాల క్రితం చనిపోవడంతో రేషన్ డీలర్ గా కొనసాగుతుంది. కొంతకాలంగా పైడాకుల సంతోష్ అనే వ్యక్తితో ఈమెకు పరిచయం ఏర్పడడంతో ఆమెతో అక్రమ సంబంధం పెట్టుకున్న సంతోష్ కొన్ని రోజులుగా ఆమెను వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది.దీనిలో భాగంగా సోమవారము రాత్రే రాజమణి గొంతు కోసి హతమార్చిన సంతోష్ గదికి తలుపులు పెట్టి పారిపోయాడు. రెండు రోజులుగా ఆమె ఫోను లిఫ్ట్ కాకపోవడంతో అనుమానం వచ్చిన ఆమె కొడుకు మంగళవారం రాత్రి గది తలుపులు తీయగా ఆమె హత్యకు గురైనట్లు తెలిసింది.ఆమె సోదరుడు ఇచ్చిన సమాచారం మేరకు బుధవారం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలకు ఇద్దరు కొడుకులు ఒక కూతురు ఉన్నట్టు తెలిసింది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!