Saturday, July 27, 2024
Homeతెలంగాణతెలంగాణ లో ఉన్న పథకాలు ఎక్కడైనా ఉన్నాయా..

తెలంగాణ లో ఉన్న పథకాలు ఎక్కడైనా ఉన్నాయా..

తెలంగాణ లో ఉన్న పథకాలు ఎక్కడైనా ఉన్నాయా..

పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి

సుల్తానాబాద్, అక్టోబర్ 04(కలం శ్రీ న్యూస్):అధికారంలో ఉన్నప్పుడు నియోజకవర్గ అభివృద్ధికి ఏం చేశారని ప్రజలు మరోసారి ప్రతిపక్షాలను నమ్మి ఎందుకు ఓటు వేస్తారని పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం సుల్తానాబాద్ మండలం చిన్నకల్వల, చిన్న బొంకూరు గ్రామాలలో గడపగడపకు ప్రచారం నిర్వహించి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడంతోపాటు గ్రామంలో జరిగిన అభివృద్ధిని తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ గత పాలకులు నియోజకవర్గ అభివృద్ధిని పట్టించుకోలేదన్నారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో సీఎం కేసీఆర్ నిరుపేదల సంక్షేమం కోసం దేశంలో ఎక్కడా లేని సంక్షేమ పథకాలను రాష్ట్రంలో అమలు చేస్తున్నారన్నారు. తెలంగాణలో అమలవుతున్న రైతుబంధు, రైతు బీమా, దళిత బంధు, బీసీ బందు, మైనార్టీ బంధు, షాదీ ముబారక్, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్టు, బతుకమ్మ చీరల పంపిణీ లాంటి ఒక్క కార్యక్రమమైన ఏదైనా రాష్ట్రంలో ఉన్నాయో ప్రజలు గమనించాలన్నారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న నాడు 200 రూపాయల పింఛన్ ఇస్తే ముఖ్యమంత్రి కేసీఆర్  రెండు వేలకు పెంచారన్నారు. దివ్యాంగుల పెన్షన్ 4 వేలకు పెంచామని, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడ వెయ్యికి మించి పింఛన్ ఇవ్వడం లేదని, అధికారం కోసం దొంగ హామీలు ఇస్తున్నారు అన్నారు. ఆరు గ్యారెంటీలు 60 గ్యారంటీలు అని చెప్పినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదన్నారు. గత రెండు పర్యాయాలు ఆదరించిన విధంగానే రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటేసి మద్దతు ఇవ్వాలని కోరారు. నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రైతు సమితి జిల్లా అధ్యక్షులు కాసర్ల అనంత రెడ్డి,ఎంపీపీ పొన్నమనేని బాలాజీ రావు , మండల పార్టీ అధ్యక్షులు పురం ప్రేమ్ చందర్ రావు, మార్కెట్ ఛైర్మెన్ బుర్ర మౌనిక-శ్రీనివాస్, రైతు సమితి మండల కో ఆర్డినేటర్ బోయిని రాజమల్లయ్య, PACS ఛైర్మెన్ మోహన్ రావు, మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత – రమేష్ , సర్పంచ్ ల ఫోరం అధ్యక్షులు సుజాత-రమేష్ ,కన్వీనర్ లు శ్రీనివాస్ రెడ్డి, రవి, భూమేష్,మండల యూత్ అధ్యక్షులు గుడుగుల సతీష్,మాజీ ఎంపీపీ పాల రామారావు,అనుబంధ సంఘాల అధ్యక్షులు క్యాదాసి చంద్రమోగిళి ,మార్కెట్ వైస్ ఛైర్మెన్ మహిపాల్ రెడ్డి,సర్పంచ్ లు రమేష్, రాజు, ఎంపీటీసీ సంపత్, ఫక్కిర్ యాదవ్, ఉప సర్పంచ్ అరుణ -మొండయ్య,మాజీ సర్పంచ్ సంజీవ రెడ్డి,నారాయణ, రైతు సమితి కో ఆర్డినేటర్ ప్రభాకర్ రెడ్డి, అనంత రెడ్డి,కృష్ణారావు, గ్రామ శాఖ అధ్యక్షులు భూమేష్,నాయకులు సుగుణాకర్ రావు, చారీ ,డైరెక్టర్ లక్ష్మణ్,అంజయ్య,మండల  సర్పంచ్ లు, కౌన్సిలర్ లు ,బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో పాటు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!