Saturday, July 27, 2024
Homeతెలంగాణఎస్ జి ఎఫ్ క్రీడలలో సత్తా చాటిన ఐపీఎస్ పాఠశాల విద్యార్థులు

ఎస్ జి ఎఫ్ క్రీడలలో సత్తా చాటిన ఐపీఎస్ పాఠశాల విద్యార్థులు

ఎస్ జి ఎఫ్ క్రీడలలో సత్తా చాటిన ఐపీఎస్ పాఠశాల విద్యార్థులు

సుల్తానాబాద్,సెప్టెంబర్ 16 ( కలం శ్రీ న్యూస్) :మండల కేంద్రంలోని సెయింట్ మేరీ పాఠశాల లో మూడు రోజులపాటు జరిగిన మండల స్థాయి క్రీడల్లో సుల్తానాబాద్ ఇండియన్ పబ్లిక్ ఉన్నత పాఠశాల విద్యార్థులు తమ ప్రతిభ కనబర్చి సత్తా చాటారు. సుల్తానాబాద్ మండల ఎస్జీఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కబడ్డీ పోటీల్లో అండర్-17 ఇయర్స్ బాలికలు మొదటి బహుమతి,అండర్-17 ఇయర్స్ బాలురు మొదటి బహుమతి,అండర్-14 ఇయర్స్ బాలురు మొదటి బహుమతి సాధించగా, వాలీబాల్ పోటీలలో అండర్-14 ఇయర్స్ బాలికలు రెండో బహుమతి సాధించారు. అదేవిధంగా కోకో పోటీలలో అండర్-14 ఇయర్స్ బాలికలు మొదటి బహుమతి గెలుపొందగా అండర్-14 ఇయర్స్ బాలికలు రెండవ బహుమతి గెలుపొందారు. వీరిని పాఠశాల కరస్పాండెంట్ మాటేటి సంజీవ్ కుమార్ ప్రిన్సిపాల్ కృష్ణ ప్రియా విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూచదువుతో పాటు క్రీడలలో ఆసక్తి కనబరిచి రాణించాలని కోరారు. క్రీడల వల్ల శరీరానికి కావలసిన వ్యాయామం,ఆరోగ్యం, దృఢంగా ఏర్పడుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు వ్యాయామ ఉపాధ్యాయులు సత్యం,ఇక్బాల్, శివ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!