బీఆర్ఎస్లోకి వలసల పర్వం
బారీగా చేరుతున్న కాంగ్రెస్శ్రేణులు
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని సెప్టెంబర్ 11( కలం శ్రీ న్యూస్ ):బీఆర్ఎస్ పార్టీలోకి వలసల పర్వం కొనసాగుతోంది. మంథని నియోజకవర్గానికి చెందిన ఆయా మండలాల్లోని కాంగ్రెస్ బీజేపీ శ్రేణులు ఆ పార్టీలను వీడి బీఆర్ఎస్లోకి చేరుతున్నారు. ఇటీవలి కాలంలో మంథని, ముత్తారం, మల్హర్ మండలాలకు చెందిన పలువురు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.తాజాగా మంథని మండలం ఎగ్లాస్ పూర్ గ్రామానికి చెందిన వార్డ్ మెంబర్ డాoక శ్రీనివాస్,కాంగ్రెస్ పార్టీ నాయకులు బూడిద గట్టయ్య, మేకల తిరుపతి మరియు సుమారు 100 మంది కాంగ్రెస్పార్టీ కార్యకర్తలు మరియు మహిళలు బీఆర్ఎస్లో చేరారు. మంథని మండలంలోని ఎగ్లాస్ పూర్ గ్రామంలో మంథని భీఆర్ ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ సమక్షంలో పార్టీలో చేరగా వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. ప్రభుత్వం, సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృధ్ది, సంక్షేమ పథకాల అమలుతో పాటు నియోజకవర్గంలో జెడ్పీ చైర్మన్ ఫుట్ట మధూకర్ చేస్తున్న సేవలకు ఆకర్షితులై ఆయనకు అండగా నిలువాలని బీఆర్ఎస్లో చేరుతున్నట్లు వారు ప్రకటించారు. నియోజకవర్గ అభివృధ్ది, ఈ ప్రాంతంలోని పేద ప్రజలకు అండగా నిలుస్తున్న జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్కు అండగా నిలిచి ఆయన గెలుపుకోసం తమవంతు సహకారం అందిస్తామని ఈ సందర్బంగా వారు స్పష్టం చేశారు. రాబోయే ఎన్నికల్లో మంథని గడ్డపై గులాభీజెండా ఎగురడం,మధన్న గెలుపు ఖాయమని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండా శంకర్,జడ్పిటిసి తగరం సుమలత శంకర్ లాల్, వైస్ ఎంపీపీ కొమ్మిడి స్వరూప్, మండల పార్టీ అధ్యక్షుడు ఏగోలపు శంకర్ గౌడ్, గ్రామ సర్పంచ్ చెన్నవేన సదానందం,ఎంపీటీసీ పెండ్లి చైతన్య ప్రభాకర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఉడత లింగయ్య,బిఆర్ఎస్ నాయకులు లోడారి రాములు,మంతిని లక్ష్మణ్,మైదం శ్రీధర్, బొడ్డు సదానందం,జంజర్ల రమేష్,చిలుక సారయ్య తదితరులు పాల్గొన్నారు.