Saturday, July 27, 2024
Homeతెలంగాణబెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదు

బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదు

బెదిరింపు రాజకీయాలకు భయపడేది లేదు

బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి 

మంథని సెప్టెంబర్ 11(కలం శ్రీ న్యూస్): బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో పలువురు బీజేపి పార్టీలో చేరారు.పెద్దపల్లి జిల్లా మంథని పట్టణం లోని బీజేపీ పార్టీ ఆఫీస్ లో తెలంగాణ ఉద్యమకారుడు ముడతనపల్లి ప్రభాకర్,తాటి కొండా లింగయ్య , మంథని మండల అధ్యక్షులు విరబోయిన రాజేందర్,మండల మహిళ మోర్చా అధ్యక్షురాలు బోసేలి మౌనిక ఆధ్వర్యంలో సోమవారం మల్హర్ రావ్ మండలం తాడిచెర్ల, నాచారం,మంథని మండలం గోపాల్ పూర్ కు చెందిన పలువురు మహిళలు,యువత సుమారు 150 మంది బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో బీజేపీ పార్టీ లో చేరారు.వీరికి సునీల్ రెడ్డి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. మన ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి చేస్తున్న సేవలను,పేద పడుగు బలహీన వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ఆకర్షితులై పార్టీలో చేరి సునీల్ రెడ్డి తో కలిసి పనిచేయాలని బిజెపి పార్టీలో చేరుతున్నట్టు వారు వెల్లడించారు. అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు బిజెపి పార్టీ పెద్దపీట వేస్తుందని, ఉద్యమకారులంతా టిఆర్ఎస్, కాంగ్రెస్ ని వదిలి బిజెపి పార్టీలో చేరాలన్నారు.ఏ ఒక్క ఉద్యమకారుని కుటుంబానికి ఒక పదవిని ఇవ్వలేదు,1200 మంది విద్యార్థులు,అమరులైతే వారి కుటుంబాన్ని ఎప్పుడు ఆదుకున్నాడు,తెలంగాణ ద్రోహులకు నేడు మంత్రి పదవులు, ఎమ్మెల్సీ పదవులు కట్టబెట్టాడని, ఈ మంథని నియోజకవర్గంలో తెలంగాణ ఉద్యమాన్ని ఒక నియంతలాగా అణిచివేసిన శ్రీధర్ బాబు,ఏనాడు తెలంగాణ ఉద్యమంలో పోరాడని పుట్ట మధుకర్ నేడు పదవులు అనుభవిస్తున్నారు.తెలంగాణ రాష్ట్రం కొరకు అమెరికాలో ఉన్నత ఉద్యోగాన్ని,స్వరాష్ట్రం కొరకు నా జీవితాన్ని త్యాగం చేస్తే రెండుసార్లు మోసం చేసి ఉద్యమ ద్రోహులను కెసిఆర్ పక్కన పెట్టుకున్నాడు, ఇప్పటికైనా తెలంగాణ ఉద్యమకారులు బిజెపి పార్టీలో చేరండి,40 సంవత్సరాలు పాలించిన శ్రీధర్ బాబు అతని అనుచరులు ఇందిరమ్మ ఇండ్లు వందలకోట్ల అవినీతి చేసిన ఎందుకు శ్రీధర్ బాబు వారిని ప్రశ్నించడం లేదు,రేక్కాడితే గాని డొక్కాడని బ్రతుకులు ఉన్న నిరుపేదలకు రావలసిన డబ్బులను దోచుకున్న కాంగ్రెస్ నాయకులను ప్రజలు నిలదీయండి,కాంగ్రెస్ పార్టీకి మంథని నియోజకవర్గంలో ఓట్లడిగే నైతిక విలువ లేదు,బిజెపి పార్టీలో చేరేవారిని బెదిరింపులకు గురి చేస్తున్నారు,ఇటువంటి పిరికిపంద చర్యలకు భయపడేది లేదు ఆరు నెలల్లో ఈ ప్రభుత్వాలు ఉండవు, ప్రజలు మీకు తగిన బుద్ధి చెబుతారని అన్నారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మల్క మోహన్ రావు,రామగిరి మండల ఇంచార్జ్ ఎడ్ల సదాశివ్, మండల ఉప అధ్యక్షులు రేపాక శంకర్,ఎస్సి మోర్చా మండల అధ్యక్షులు బూడిద రాజు,సీనియర్ నాయకులు కోరబోయిన మల్లిక్,బోసెల్లి శంకర్, అలవేణి సమ్మయ్య,కురుమ శేఖర్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!