Saturday, July 27, 2024
Homeతెలంగాణసరిహద్దు జిల్లాల పోలీస్ అధికారుల సమన్వయ సమావేశం

సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారుల సమన్వయ సమావేశం

సరిహద్దు జిల్లాల పోలీస్ అధికారుల సమన్వయ సమావేశం

సుల్తానాబాద్,సెప్టెంబర్06(కలం శ్రీ న్యూస్):రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్., (డిఐ జి)  ఆదేశాల మేరకు పెద్దపల్లి ఏసిపి ఎడ్ల మహేష్, కరీంనగర్ రూరల్ ఏసిపి , కరుణాకర్ రావు, కరీంనగర్ టౌన్ ఏ.సి.పి నరేందర్ ఆధ్వర్యంలో బొంత కుంటపల్లి గెస్ట్ హౌస్ సుల్తానాబాద్ లో సబ్ డివిజన్ పోలీస్ అధికారులుతో తెలంగాణ రాష్ట్రంలో రాబోయే సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఒక ప్రత్యేక ప్రణాళికను రూపొందించడానికి సమావేశమయ్యారు. ఎన్నికల ముందు, ఎన్నికల సమయం లో జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మావోయిస్టుల కదలికలపై ప్రత్యేక నిఘా,ఎన్నికల ముందు, ఆ సమయంలో మద్యం,నగదు సరఫరా నియంత్రణ కొరకు చేపట్టాల్సిన చర్యల గురించి చర్చించారు. జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో ప్రవేశ , నిష్క్రమణ మార్గాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేసి పకడ్బందీగా తనిఖీలు చేపట్టేలా నిర్ణయాలు తీసుకున్నారు. గంజాయి, ఇతర మాదకద్రవ్యాల రవాణా నియంత్రణకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ప్రణాళికలు రూపొందించడం జరిగింది.

ఈ సమావేశంలో పెద్దపల్లి ఏసిపి ఎడ్ల మహేష్ కరీంనగర్ రూరల్ ఏసిపి , కరుణాకర్ రావు, కరీంనగర్ టౌన్ ఏ సి పి, నరేందర్,  పెద్దపల్లి సీఐ అనీల్,సుల్తానాబాద్ సీఐ జగదీశ్ , కరీంనగర్ రూరల్, సీఐ ప్రదీప్, ఎల్.ఎం.డి సీఐ ఇంద్ర సేన రెడ్డి, చొప్పదండి సీఐ రవీందర్ లతో సుల్తానాబాద్ యస్.ఐ విజేందర్ , జూలపల్లి ఎస్ఐ వెంకట కృష్ణ, కాల్వ శ్రీరాంపూర్ ఎస్ ఐ శ్రీనివాస్, పోత్కపల్లి ఎస్ఐ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!