Saturday, July 27, 2024
Homeతెలంగాణఉన్న స్థానం నుండి ఉన్నతమైన స్థానానికి చేర్చిన దైవమే ఉపాధ్యాయుడు

ఉన్న స్థానం నుండి ఉన్నతమైన స్థానానికి చేర్చిన దైవమే ఉపాధ్యాయుడు

ఉన్న స్థానం నుండి ఉన్నతమైన స్థానానికి చేర్చిన దైవమే ఉపాధ్యాయుడు

ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్ 

మంథని సెప్టెంబర్ 5(కలం శ్రీ న్యూస్ ):రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉద్యోగులకు ఇబ్బందుల గురిచేస్తున్న సిపిఎస్ విధానాన్ని చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేస్తాం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ ఉపాధ్యాయులు 317 జీవో ద్వారా చాలా నష్టపోయారు,కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన వెంటనే 317 జీవో రద్దు చేసి, వారందరికీ న్యాయం చేస్తాము.ఏఐసీసీ కార్యదర్శి,మంథని శాసనసభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు.మంగళవారం మంథని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కుచ్ రాజ్ పల్లిలో తెలంగాణ మైనార్టీ రెసిడెన్సీ స్కూల్, జిల్లా పరిషత్ ప్రాథమిక బాలికల పాఠశాల, జిల్లా పరిషత్ బాలుర పాఠశాలలో,భారత మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తూ,వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే గురువులందరికి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.అనంతరం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులను శాలువతో సత్కరించిన మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు.సమాజానికి ఉపాధ్యాయులు చేస్తున్న సేవలు మరువలేనివి జీవన వికాసానికి నిచ్చెన వేసే అక్షర కార్మికుడు గురువు.నేటి బాలలే రేపటి పౌరులు. ఆ పౌరులను బాధ్యతాయుత వ్యక్తులుగా బంగారు భవిష్యత్తుకు మార్గనిర్దేశకులుగా ప్రగతి రథ సారధులుగా నిలిపేవారే ఉపాధ్యాయులు.మంథని ప్రాంతం విద్య నిలయంగా ఉంది,మంథని ప్రాంతంలో డిగ్రీ కళాశాల,అన్ని మండలాల్లో జూనియర్ కళాశాలలు,పాలిటెక్నిక్ కళాశాల, ఐఐటి కళాశాల,హార్టికల్చర్ కళాశాల,జెఎన్టీయూ కళాశాల, గిరిజన ఆశ్రమ పాఠశాలు,మోడల్ స్కూల్ ఇలా చాలా విద్యాలయాలు విద్యార్థులు చదువుకోడానికి తీసుకురావడం జరిగింది,రానున్న రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వo వచ్చిన వెంటనే ప్రతి చదువుకున్న విద్యార్థికి ఇక్కడే ఉద్యోగం చేసేలా చిన్న చిన్న ఫ్యాక్టరీలు నెలకొల్పి ప్రతి ఒక్కరికి ఉద్యోగం వచ్చేలా కృషి చేస్తానని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు తెలిపారు. మంథని నియోజకవర్గ ప్రాంతంలో ఎక్కడ ఎక్కడ నుండి వచ్చి మా ప్రాంతంలో చదువును విద్యార్థికి అందిస్తున్న ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా వారికి ప్రత్యేక శుభాకాంక్షలు తెలుపుతున్నాను అన్నారు.ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు,కాంగ్రెస్ యూత్ కాంగ్రెస్ అన్ని విభాగాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!