Saturday, July 27, 2024
Homeతెలంగాణశ్రావణమాసంలో వచ్చిన సంకటహర చతుర్థి

శ్రావణమాసంలో వచ్చిన సంకటహర చతుర్థి

శ్రావణమాసంలో వచ్చిన సంకటహర చతుర్థి

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్

మంథని, సెప్టెంబర్ 3 (కలం శ్రీ న్యూస్):అత్యంత పవిత్రమైన మాసాలలో శ్రావణమాసం ఎంతో ప్రసిద్ధిగాంచినది. ఈ శ్రావణమాసంలో వచ్చిన సంకష్టహర చతుర్థి ఎంతో పవిత్రమైనది మానవులు దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న కష్టాలను తొలగించడానికి సంకటహర చతుర్థి దీక్ష చేపడుతుంటారు.మానవులకు దైనందిన జీవితంలో ఏవైనా ఇబ్బందులు,కష్టాలు,సమస్యలు ఉంటే ఈ సంకష్టహర చతుర్థి రోజున ఉపవాసం ఉంటే ఆ సమస్యలన్నీ తీరిపోతాయని శాస్త్రం చెబుతోంది.ఈ వ్రతాన్ని కృష్ణపక్షంలో ఉండే చవితి రోజున మొదలుపెట్టాలి.సంధ్యా సమయానికి చవితి తిథి ఉంటుంది. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే చవితి సంకష్టహర చతుర్థి. ఈ రోజున వినాయకునికి ఇష్టమైన ఉండ్రాళ్ళు నైవేద్యంగా పెట్టి గరికతో సంకష్టహర వినాయకా అని పూజించాలి. ఈ విధంగా 21 నెలల పాటు ఈ వ్రతాన్ని చేస్తే సంకటాలన్నీ కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. సంకష్ట హర చతుర్థి పర్వదినమున పురస్కరించుకొని ఆదివారం భక్తిశ్రద్ధలతో భక్తులు పూజలు నిర్వహించారు. సంకటాలు తొలగించే సంకటహర చతుర్థి దీక్షతో భక్తులు పునీతులు అవుతున్నారు. ఆషాడ మాసంలో వచ్చిన సంకటహర చతుర్థి దీక్ష చేపట్టిన భక్తులతో శ్రీ విఘ్నేశ్వర స్వామిని భక్తులు దర్శించుకుని పునీతులయ్యారు. ప్రతి నెలలో ఒకసారి వచ్చే సంకటహర చతుర్థి పర్వదినం రోజున మంథని పట్టణంలోని శ్రీ మహాగణపతి దేవాలయం శుక్రవారం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం రాత్రి చంద్రోదయం అనంతరం 9: 24 గంటలకు చతుర్థి దీక్ష చేపట్టిన భక్తులు చంద్రోదయం అనంతరం భోజనం చేస్తారు. ప్రాచీన కాలంగా ఎంతో ప్రసిద్ధిగాంచిన శ్రీ మహాగణపతి ఆలయం మంథని పట్టణంలోని తమ్మిచెరువు కట్ట లో కొలువుతీరి ఉంది ఈ శ్రీ మహాగణపతి దేవాలయం అనాదిగా ఎంతో విశిష్టత సంతరించుకుంది.

శ్రావణ మాసం వచ్చిన సంకట చతుర్థి సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు వచ్చి మహాగణపతిని దర్శించుకున్నారు. సంకటహర చతుర్థి పర్వదినం రోజున శ్రీ విఘ్నేశ్వర స్వామి కి 121 మోదకుడు సమర్పించడం అలాగే దూర్వాలు సమర్పించడం ఎంతో శ్రేయస్కరం అని భక్తుల విశ్వాసం. ప్రతినిత్యం ముఖ్యంగా ప్రతి మంగళవారం ఎందరో భక్తులు ఆలయంలో మహా గణపతిని దర్శించుకొని వెళుతుంటారు. ప్రతి మంగళవారం భక్తులు విగ్నేశ్వరుని పూజిస్తుంటారు. ముఖ్యంగా సంకటహర చతుర్థి రోజున మంథని పట్టణ ప్రజలే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుండి సైతం అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకుంటారు. సంకటహర చతుర్థి దీక్ష పట్టిన భక్తులు రాత్రి చంద్రోదయం అనంతరం మాత్రమే ఉపవాస దీక్షను విరమిస్తారు. ఈ సందర్భంగా ఆలయాన్ని అనేక రకాల పూలతో అలంకరించారు. ఈ సందర్భంగా ఆలయంలో స్వామి వారిని ఆలయ పూజారులు పల్లి సంజీవ్, పల్లి రాము ప్రత్యేకంగా అలంకరించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!