ఆదివరహాస్వామిని దర్శించుకున్న జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్
ఘనస్వాగతం పలికిన ఆలయ కమిటి సభ్యులు
మంథని రిపోర్టర్ /నాంపల్లి శ్రీనివాస్
మంథని ఆగస్టు 29 (కలం శ్రీ న్యూస్):కమాన్పూర్ మండల కేంద్రంలో ప్రసిద్దిగాంచిన ఆదివరహాస్వామిని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,జెడ్పీ చైర్మన్ ఫుట్ట మధూకర్ దర్శించుకున్నారు. ఆదివరహస్వామి జయంతి ఉత్సవాల్లో బాగంగా ఆలయ కమిటి సభ్యుల ఆహ్వనం మేరకు ఆలయంలో ప్రారంభమైన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉత్సవాల సందర్బంగా ఆలయానికి వచ్చిన ఆయనకు ఆలయ కమిటి సభ్యులు బారీ పూలమాలతో ఘన స్వాగతం పలికారు.అనంతరం ఉత్సవాల సందర్బంగా చేపట్టిన పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.ఈ సందర్బంగా శ్రీ భూవరహస్వామి కళ్యాణోత్సవంలో ఆయన పాల్గొన్నారు.పూజల అనంతరం ఆలయ అర్చకులు జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కు ఆశీర్వాదం అందజేశారు.నియోజకవర్గ ప్రజలు సుఖసంతోషాలతో, పాడిపంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని వేడుకున్నట్లు జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ తెలిపారు.అనంతరం ఆలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన వాటర్ ప్లాంట్ను ఆయన స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి ప్రారంభించారు.