Saturday, July 27, 2024
Homeతెలంగాణపెరిక సంఘం భవన శంకుస్థాపన విజయవంతం చేయండి         

పెరిక సంఘం భవన శంకుస్థాపన విజయవంతం చేయండి         

పెరిక సంఘం భవన శంకుస్థాపన విజయవంతం చేయండి             

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్

మంథని ఆగస్టు 24 (కలం శ్రీ న్యూస్):పెరిక సంఘం భవన నిర్మాణ భూమి పూజ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గాండ్ల చంద్రశేఖర్ రాష్ట్ర నాయకుడు మీసా అర్జున్ రావు లు పిలుపునిచ్చారు.ఈ సందర్భంగా మంథని ప్రెస్ క్లబ్లో పెరక సంఘం వాల్ పోస్టర్ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తమ కుల సంఘానికి కేటాయించిన స్థలంలో భవనాన్ని నిర్మించుకున్న దిశగా తాము ముందుకు సాగుతున్నామని వారు పేర్కొన్నారు.హైదరాబాద్ కోకాపేట్ లో ప్రభుత్వ ఇచ్చిన రెండు ఎకరాల స్థలంలో ఈనెల 27న నిర్మాణానికి భూమి పూజ చేస్తున్న సందర్భంగా మంథని నియోజక వర్గం నుండి పెద్ద సంఖ్యలో కుల బాంధవులు తరలిరావాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పెరిక సంఘం నాయకులు బత్తుల రమేష్,అత్తె చంద్రమౌళి,అల్లం రామస్వామి, దుమ్ముని లక్ష్మణ్,తోంబూరపు తిరుపతి,అల్లం తిరుపతి,పెట్టం రామస్వామి,దుండ రాజేందర్, తీర్థాల లక్ష్మణ్,గోవిందుల ఆనంద్, సోమిశెట్టి నారాయణ,ఉగ్గే కుమార్,దొమ్మటి రమేష్,సందేళ్ళ కుమార్,పేరం రవి,రామినేని రవి, అలిశెట్టి సుమన్,పేరం చిరంజీవిలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!