Saturday, July 27, 2024
Homeతెలంగాణమావోయిస్టు నాయకులు మల్లా రాజిరెడ్డి,కట్టా రామచంద్రారెడ్డి లు క్షేమం

మావోయిస్టు నాయకులు మల్లా రాజిరెడ్డి,కట్టా రామచంద్రారెడ్డి లు క్షేమం

మావోయిస్టు నాయకులు మల్లా రాజిరెడ్డి,కట్టా రామచంద్రారెడ్డి లు క్షేమం

ఉత్తర సబ్ జోనల్ దండకారణ్యం బ్యూరో అధికార ప్రతినిధి మంగ్లీ

మంథని, ఆగస్టు 22(కలం శ్రీ న్యూస్ ):భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) నాయకులు కామ్రేడ్స్ మల్లా రాజిరెడ్డి (సంగ్రామ్),కట్టా రామచంద్రారెడ్డి లు క్షేమంగానే ఉన్నారని ఉత్తర సబ్ జోనల్ దండకారణ్యం బ్యూరో అధికార ప్రతినిధి మంగ్లీ పేరున పాత్రికేయులకు అందించిన పత్రంలో పేర్కొన్నారు.ఆగస్టు 19న మా నాయకులు మరణించినట్టుగా తెలుగు,హిందీ పత్రికల్లో వచ్చిన అబద్ధపు వార్తా కథనాలను దండకారణ్య ఉత్తర సబ్ జోనల్ బ్యూరో భాకాపా(మావోయిస్టు) తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. మా ఇద్దరి నాయకులు క్షేమంగా,సురక్షితంగా ఉన్నారని,వీరి క్షేమ సమాచారం కోసం  ఎదురుచూస్తున్న యావత్ విప్లవ ప్రజానీకానికి సంస్థలకు వాళ్ళిద్దరి కుటుంబ సభ్యులకు బంధుమిత్రులకు తెలియజేస్తున్నట్లు పేర్కొన్నారు.ప్రజలను అయోమయంలో ముంచెత్తడానికి విప్లవం పట్ల అవిశ్వాసం కలిగించడానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో పోలీసులు,ఇంటెలిజెన్స్, ఉన్నత అధికారులు మా పార్టీ నాయకుల అనారోగ్యాల పట్ల తరచూ మీడియాలో అబద్ధపు ప్రచారం చేస్తున్నారన్నారు.ఇది పార్టీకి వ్యతిరేకంగా పాలకవర్గాలు చేపట్టిన మానసిక యుద్ధంలో భాగమేనన్నారు.పాలకవర్గాలు చేసే ఈ దుష్ప్రచారాన్ని నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!