Saturday, July 27, 2024
Homeతెలంగాణసుల్తానాబాద్ వరద ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

సుల్తానాబాద్ వరద ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

సుల్తానాబాద్ వరద ప్రాంతాల్లో పర్యటించిన జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్

సుల్తానాబాద్,జులై27(కలం శ్రీ న్యూస్):జిల్లాలో భారీ వర్షాల దృష్ట్యా వరద ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ గురువారం పర్యటించారు.

సుల్తానాబాద్ పట్టణంలో వరద కారణంగా చెరువులు పొంగిపొర్లుతుండడంతో స్వప్న కాలనీలో ఇండ్ల ప్రాంగణంలో నీరు చేరింది. స్వప్న కాలనీ సందర్శించిన జిల్లా కలెక్టర్, మెడికల్ బృందాలను ఏర్పాటు చేసి స్వప్న కాలనీలోని ప్రతి ఇంటి వద్ద ప్రజలకు పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందించాలని కలెక్టర్ సూచించారు.

సుల్తానాబాద్ పట్టణంలో జలమయమైన పూసాల రోడ్డును పరిశీలించిన కలెక్టర్ జేసిబీ సహాయంతో నీటి ప్రవాహానికి ఆటంకాలు తొలగించి త్వరితగతిన క్లియర్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అనంతరం పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి ఆర్.టి. ఓ. కార్యాలయం దగ్గర గల రోడ్డు వద్ద జలమయమైనా రోడ్డును పరిశీలించిన కలెక్టర్, ముందు జాగ్రత్త చర్యలు వహించాలని అప్రమత్తంగా ఉండాలని స్థానికులకు, అధికారులకు సూచించారు.

సుల్తానాబాద్ పర్యటనలో కలెక్టర్ వెంట సుల్తానాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ ముత్యం సునీత, సుల్తానాబాద్ తహసిల్దార్ యాకన్న, ఎస్సై విజేందర్,పలువురు కౌన్సిలర్ లు,నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!