Saturday, July 27, 2024
Homeతెలంగాణనిస్వార్థ జీవి పనకంటి కిషన్ రావు 

నిస్వార్థ జీవి పనకంటి కిషన్ రావు 

నిస్వార్థ జీవి పనకంటి కిషన్ రావు 

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జూలై 24 (కలం శ్రీ న్యూస్ ): ముఖ్యమంత్రి,ప్రధాన మంత్రి స్ధాయీలలో తన మాట చెల్లుబాటు అయినప్పటికీ డబ్బు మూఠలకు, స్వార్థపు పబ్బాలకు తావీయని త్యాగ మూర్తి పనకంటి కిషన్ రావు అని కొండేల మారుతి శ్లాఘించారు.మంథని క్రియాశీలక రాజకీయాల లో భీష్మాచారులుగా విఖ్యాత మైన కిషన్ రావు 96 వ జయంతి మంథని విద్యార్థి యువత నిర్వహించింది.స్థానిక కార్యాలయంలో సోమవారం కొనసాగిన జయంతి కార్యక్రమంలో ఆయన రాజకీయ ప్రస్థానం స్వాతంత్ర్య సమర యోధుడిగా, సోషలిస్టు నేతగా వారీ జీవనశైలి గురించి వక్తలు ప్రశంసిస్తూ ప్రసంగించారు.మంథని పంచాయతీ సమితి అధ్యక్షులుగా నాలుగు పర్యాయాలు అవిభక్త కరీంనగర్ జిల్లా పరిషత్ అధ్యక్షులుగా చేసిన సేవలు బహూళ ప్రశంసనీయమని పలువురు విభిన్న అంశాలను ప్రస్తావించారు.పివి సహాచర మిత్రుడుగా అత్యంత ఆప్తుడిగా జగమెరిగిన కిషన్ స్మృత్యర్థం గా తగు రీతిలో నామకరణం అలాగే నిర్మాణాలను చేపట్టే క్రియశీలక అంశాలలో తగు భాద్యతలు మోస్తామని కోమా ప్రకటించారు.కిషన్ రావు జీవన స్రవంతి ప్రస్తావించిన వారిలో బిజేపి నాయకులు కొండపాక సత్యప్రకాశ్,టిఆర్ఎస్ నాయకులు రామడుగు మారుతి రావు‌,తాటి బుచ్చన్న గౌడ్,ఆర్ఆర్ మీడియా యం‌.డి మేడగోనీ రాజమౌళి గౌడ్‌, మైనారిటీ నాయకులు షరీఫోద్దీన్, విశ్రాంత గెజిటెడ్ హెచ్.యం మాడీశెట్టి శ్యాంసుందర్, మధుర గాయకులు చిన్నబాపు ,కాంగ్రెసు నాయకులు టక్కెగారి కిట్టన్న లు పాల్గొన్నారు. కాగా స్వర్గీయ పనకంటి కిషన్ రావు తనయుడు పనకంటి చంద్రశేఖర్ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!