Saturday, July 27, 2024
Homeతెలంగాణసామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి   

సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి   

సామాజిక బాధ్యతగా మొక్కలు నాటాలి     

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్ 

మంథని,జూలై 22( కలం శ్రీ న్యూస్):పర్యావరణ పరిరక్షణ కోసం తమ సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంథని ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ ఇందారపు రాంకిషన్ కోరారు.మంథని ఎల్ఐసీ బ్రాంచ్ ఆధ్వర్యంలో స్థానిక ఫ్రెండ్స్ క్లబ్ అవరణలో శనివారం మొక్కలు నాటారు.ఈ సందర్భంగా మేనేజర్ ఇందారపు రాంకిషన్‌ మాట్లాడుతూ పర్యావరణాన్ని సమతోల్యం చేయడంలో మొక్కలు కీలక భూమిక పోషించి జీవ కోటికి ప్రాణవాయువు అందచేస్తాయన్నారు.ఈ కార్యక్రమంలో సీనియర్ డెవలప్‌మెంట్ ఆఫీసర్స్ బెజ్జాల హరికిరణ్,జీపీసీ రెడ్డి,ఆఫీసర్ శ్రీనివాస్,ఫ్రెండ్స్ క్లబ్ అధ్యక్షుడు గోపాల్ రెడ్డి,పర్యావరణ ప్రేమికుడు గట్టు కృష్ణమూర్తి,ఏజెంట్స్ పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!