వర్షాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
– మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ
మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్
మంథని జులై 19 (కలం శ్రీ న్యూస్ ):మున్సిపల్ ప్రజలు గత రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల తోతట్టు ప్రాంతం (గోదావరి,బొక్కల వాగు సమీపంలో) ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.మీకు ఎలాంటి సహాయం కావలసి వచ్చిన పరిష్కరించేందుకు మమ్ములను, వార్డు కౌన్సిలర్స్ ను సంప్రదించగలరు.పునరావాస కేంద్రాలను కూడా ఏర్పాటు చేస్తున్నాము.అలాగే ప్రజలు వర్షాల వల్ల కలిగే సిజనల్ వ్యాధులు రాకుండా పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోని చెత్తను మా మున్సిపల్ పారిశుధ్య సిబ్బందికి ఇవ్వగలరు. శిథిలావస్థలో ఉన్న గృహములలో ఉండకూడదని అలాగే విద్యుత్ స్తంభాల దగ్గరకు ఎవరు వెళ్లకూడదని ప్రజలు సూచనలు సలహాలు పాటించ గలరని ప్రజలకు ప్రమాదాలు తలెత్తకుండా తగు జాగ్రత్తలు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నమని తెలిపిన మున్సిపల్ చైర్పర్సన్ పుట్ట శైలజ.