Saturday, July 27, 2024
Homeతెలంగాణమత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ గా పోతరవేని క్రాంతి కుమార్ ఏకగ్రీవ...

మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ గా పోతరవేని క్రాంతి కుమార్ ఏకగ్రీవ ఎన్నిక

మత్స్య పారిశ్రామిక సహకార సంఘం పెద్దపల్లి జిల్లా డైరెక్టర్ గా పోతరవేని క్రాంతి కుమార్ ఏకగ్రీవ ఎన్నిక

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్ 

మంథని జులై 4( కలం శ్రీ న్యూస్):పెద్దపల్లి జిల్లా కేంద్రంలో డిఎఫ్ఓ భాస్కర్ అధ్యక్షతన జరిగిన మత్స్యపారిశ్రామిక సహకార సంఘం చైర్మన్ మరియు డైరెక్టర్ల ఎన్నిక సందర్భంగా పోతరవేని క్రాంతి ని మంగళవారం మంథని మండల మత్స్య పారిశ్రామిక సహకార సంఘం అధ్యక్షులు,13 సభ్యులు ఏకగ్రవంగా ఎన్నుకున్నారు.

ఈ ఎన్నిక మత్స్యశాఖను బలోపేతం చేయడంలో ఎంతో కీలకంగా ఉంటుందని, రానున్న రోజుల్లో చైర్మన్ కలిపాక నర్సయ్య సహకారంతో మత్స్యశాఖను మరింత బలోపేతం చేసి ప్రతి ఒక్క మత్స్యకారునికి తగువిధంగా ప్రభుత్వ ఫలాలు అందేలాగా కృషి చేస్తానని ఈ సందర్భంగా వారు తెలిపారు.మత్స్య కార్మికుల సమస్యలపై అనుక్షణం ప్రతినిధిగా ఉంటూ తీర్చడానికి ప్రయత్నం చేస్తా అని నమ్మకంతో ఈ బాధ్యతలు అప్పజెప్పిన మంథని మండలం ప్రతి ఒక్క అధ్యక్షునికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేసిన పోతరవేని క్రాంతి కుమార్.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!