Saturday, July 27, 2024
Homeతెలంగాణఅనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే సమాచారం అందించాలి:సీఐ జగదీష్

అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే సమాచారం అందించాలి:సీఐ జగదీష్

అనుమానాస్పద వ్యక్తులు కనిపించినట్లయితే సమాచారం అందించాలి:సీఐ జగదీష్

 సుల్తానాబాద్,జూన్28(కలం శ్రీ న్యూస్):ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సుల్తానాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని రామునిపల్లి గ్రామంలో భుదవారం సుల్తానాబాద్ సీఐ జగదీష్ ఆధ్వర్యం లోఎస్ఐ విజేందర్ , 35 మంది పోలీసులతో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహించి స్థానిక ప్రజలతో మాట్లాడడం జరిగింది.వాహన పత్రాలు సరిగా లేనటువంటి 39 బైకులు, ఒక ఆటో, ఒక ట్రాలీ లను సిజ్ చేయడం జరిగింది.

ఈ సందర్భంగా సీఐ జగదీష్  మాట్లాడుతూ… నేరాల నిర్మూలన కోసమే కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజల రక్షణ, భద్రత పోలీస్ బాధ్యత అని , గ్రామాల్లో కొత్త వ్యక్తులు, నేరస్తులు, షెల్టర్ తీసుకుని ఉంటే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ కూడదని, యువత చెడు అలవాట్లకు బానిసగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించారు. గ్రామాల్లో ఎలాంటి సమస్యలున్నా తమ దృష్టికి తీసుకరావాలని లేదా సమస్యలుంటే 100 నంబర్ కి కాల్ చేయాలని సూచించారు. సైబర్ నేరాలు, మోసగాళ్ల ఫోన్ కాల్స్, మెసెజ్ లకు స్పందించవద్దని సూచించారు. ప్రతి ఒక్కరూ రోడ్డు భద్రతా నియమాలను పాటించాలని, చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చర్యలు తప్పవన్నారు.వాహనాలు నడిపే టప్పుడు తప్పకుండా హెల్మెట్ ధరించాలి అని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ అందరు కలిగి ఉండాలి అన్నారు. గ్రామాలలో మరింత స్వీయ రక్షణ కొరకు సీసీ. కెమెరాలను అమర్చుకోవాలని ఈ విషయంలో పోలీసుల సహకారం ఉంటుందని, భద్రతా పరమైన అంశాల లో సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.

ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ సీఐ జగదీష్, సుల్తానాబాద్ ఎస్ఐ లు విజేందర్, వినిత జూలపల్లి ఎస్ఐ వెంకట కృష్ణ, కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ శ్రీనివాస్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!