Saturday, July 27, 2024
Homeతెలంగాణతాటి చెట్టు ఎక్కి కల్లు గీసి గౌడ్‌ గా మారిన జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌

తాటి చెట్టు ఎక్కి కల్లు గీసి గౌడ్‌ గా మారిన జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌

తాటి చెట్టు ఎక్కి కల్లు గీసి గౌడ్‌ గా మారిన జెడ్పీ చైర్మన్‌ ఫుట్ట మధూకర్‌

మంథని రిపోర్టర్/నాంపల్లి శ్రీనివాస్

మంథని జూన్ 20(కలం శ్రీ న్యూస్):సాధారణంగా గౌడ కులస్తులు మాత్రమే తాటి ఈత చెట్టు ఎక్కి కల్లు గీస్తారు. కానీ ఇక్కడ మాత్రం జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ గౌడ్‌గా మారి తాటి చెట్టు ఎక్కి కళ్లు గీశారు.రామగిరి మండలం చందనాపూర్‌ గ్రామంలో జరిగిన రేణుకా ఎల్లమ్మ తల్లి జమదగ్ని మహముని కళ్యాణ మహోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయనకు గౌడ కులబాంధవులు కులవృత్తి పరికరమైన మోకుతాడుతో సన్మానించారు.అనంతరం ఆయన తాటి చెట్టు ఎక్కి కల్లు గీశారు. కళ్యాణ మహోత్సవం సందర్బంగా ఎల్లమ్మ తల్లిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసినారు.ఆయన తాటి చెట్టు ఎక్కి కల్లు గీసి తీసుకువచ్చి అమ్మవారికి నైవేద్యం సమర్పించారు. జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ తాటి చెట్టు ఎక్కి కల్లు గీయడం స్థానికులను అబ్బురపరిచిది.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!