ఎమ్మెల్సీ కవిత కి సుదర్శన నరసింహ యాగం ప్రసాదం అందజేసిన చల్లా నారాయణ రెడ్డి
మంథని,జూన్ 5(కలం శ్రీ న్యూస్): మంథని నియోజకవర్గం కాటారం మండలంలోని ఆంజనేయుల స్వామి ఆలయంలో జూన్ 2వ తేదీన తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా ముఖ్యమంత్రి కేసీఆర్ భారత ప్రధాని కావాలని భారత దేశానికి మరెన్నో సేవలు అందించాలని వారు వారి కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో,అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని అర్చకులతో వేద మంత్రాల సాక్షిగా “సుదర్శన నరసింహ యాగం” నిర్వహించిన బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు,కాటారం పిఏసిఎస్ చైర్మన్ చల్ల నారాయణ రెడ్డి. దీనిలో భాగంగా సోమవారం ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కు హైదరాబాద్ లోని ఆమె స్వగృహంలో యాగ ప్రసాదాన్ని అందజేశారు.