నల్ల బ్యాడ్జీలతో జర్నలిస్టుల నిరసన
మంథని జూన్ 2(కలం శ్రీ న్యూస్):పెండింగ్ లో ఉన్న తమ సమస్య లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని,అర్హులైన జర్నలిస్టులoదరికీ ఇండ్లు,ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మంథనిలో జర్నలిస్టులు నల్ల బ్యాడ్జి ధరించి శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. టియుడబ్ల్యూజే యూనియన్ పిలుపు మేరకు స్థానిక ఆర్డీవో కార్యాలయ ఆవరణలో జరిగిన తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఆవిర్భావ వేడుకలకు నల్ల బ్యాడ్జీలు ధరించి తమ నిరసన వ్యక్తం చేశారు. సమస్యలను ఆర్డీవొ వీరబ్రహ్మచారి దృష్టికి తీసుకెళ్లారు.ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు కొమురోజు చంద్రమోహన్,పోతరాజు సమ్మయ్య,పెండ్యాల రామ్ కుమార్, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు అంకరి కుమార్ తదితర జర్నలిస్టులు పాల్గొన్నారు.