బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు..
మంథని మే 2(కలం శ్రీ న్యూస్):బిజెపి రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మరియు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు మంథని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా సీనియర్ నాయకులు సత్య ప్రకాష్ మాట్లాడుతూ నాడు తెలంగాణ బిల్లును పూర్తిస్థాయిలో సమర్ధించి సుష్మా స్వరాజ్ తెలంగాణ రావడంలో కీలక పాత్ర పోషించారని అమృత త్యాగాలను విస్మరించి ప్రస్తుత భారత రాష్ట్ర సమితి బడుగు బలహీన వర్గాలకు అన్ని రకాలుగా ప్రజలకు అన్యాయం చేస్తుందని త్వరలోనే వీరికి గుణపాఠం చెప్పే రోజులు వస్తాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదాశివ్, జనరల్ సెక్రెటరీ సబ్బని సంతోష్, కో కన్వీనర్ నాంపల్లి రమేష్,ముత్తారం మండల ఇన్చార్జి పోతారవేని క్రాంతి,సీనియర్ నాయకులు సత్య ప్రకాష్, బోగోజు శ్రీనివాస్, చీదురాల మధుకర్ రెడ్డి, రాపర్తి సంతోష్,కాసిపేట సంతోష్ మల్లికార్జున్,లక్ష్మణ్,నారమల్ల కృష్ణ,సూర్య, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు