మేరు కుల సంఘ భవనానికి భూమి పూజ
మంథని,మే 1(కలం శ్రీ న్యూస్):మంథని పట్టణ మేరు కుల సంఘ భవనానికి తమ్మ చెరువు కట్ట వీధిలో శాస్త్రోక్తంగా భూమి పూజ నిర్వహించారు. గురువారం వేద పండితుడు మత్స శివప్రసాద్ ఆధ్వర్యంలో గణపతి పూజ, పుణ్యవచనం,నవగ్రహాల పూజ, భూమి పూజ కార్యక్రమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. పెండ్యాల తిరుమలయ్య మల్లేశ్వరి, గూడూరి రాజేందర్ సూరమ్మ, రాపర్తి సంతోష్ లక్ష్మి, మంతెన శంకరయ్య తార, మాడిశెట్టి సంతోష్ విజయలక్ష్మి దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొని భూమిపూజ ను నిర్వహించారు. మేరు కులస్తుల ఐక్యత కోసం,ఆత్మీయ సమావేశాలు నిర్వహించడం కోసం,మేరు కుల ఆత్మ గౌరవం కోసం ఈ నిర్మాణాన్ని చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వార్డు కౌన్సిలర్ వికే రవి లతో పాటు మేరు కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.