Saturday, July 27, 2024
Homeతెలంగాణవాటర్ సర్వీసింగ్ చేస్తుండగా విద్యుత్ షాక్ తో యువకుడు మృతి...

వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా విద్యుత్ షాక్ తో యువకుడు మృతి…

వాటర్ సర్వీసింగ్ చేస్తుండగా విద్యుత్ షాక్ తో యువకుడు మృతి…

మంథని మే 31(కలం శ్రీ న్యూస్):మంథని పట్టణంలోని గ్యాస్ గోదాం సమీపంలో గల వాటర్ సర్వీసింగ్ సెంటర్ లో విధులు నిర్వహిస్తున్న శనిగరపు కుమారస్వామి (18) అనే యువకుడు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు.మృతుడు కుమారస్వామి అనే యువకుడు హార్వెస్టర్ కడుగుతుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో మృతి చెందాడు.మంథని మండలం రచ్పపల్లి గ్రామానికి చెందిన వాస్తవ్యుడు.మృతుడు తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు.మృతుని తండ్రి సింగరేణిలో విధులు నిర్వహిస్తూ ఈ మధ్యనే మెడికల్ అన్ ఫిట్ తీసుకొని పదవి విరమణ పొందారు. తండ్రి తన ఉద్యోగాన్ని తన కొడుకు శనిగరపు కుమారస్వామికి పెట్టించాలని ఉద్యోగ ప్రయత్నం ముందుకు సాగుతున్న తరుణంలో కుమారస్వామి వాటర్ సర్వీసింగ్ సెంటర్లో విద్యుత్ షాక్ తో మృతి చెందాడు.మరో నాలుగు నెలలు గడుస్తే మృతుడు సింగరేణిలో విధులు నిర్వర్తించేవాడు అని స్థానికులు చెప్పిన సమాచారం

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!