బండి సంజయ్ కి వినతి పత్రం అందించిన విఓఏ లు.
మంథని మే 18(కలం శ్రీ న్యూస్):తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కి బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునిల్ రెడ్డి అధ్వర్యంలో గురువారం హైదరాబాద్ లోని శుభం కన్వెంశన్ హల్ నాగోల్ లో వినతిపత్రం అందించిన వివోఏ లు.వివోఏల సమస్యలపై రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరవధిక సమ్మెలో భాగంగా విఓఏ ల సమస్యలపై ప్రభుత్వాన్ని ఎండగట్టి వివోల డిమాండ్స్ కనీస వేతనం అమలు ఉద్యోగ భద్రత అర్హులైన విఓఏ లను సీసీ లు గా గుర్తించాలని కోరడమైనది.రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ స్పందిస్తూ మీ సమస్యలపై పోరాడుతామని,రానున్న మన ప్రభుత్వంలో మీ డిమాండ్స్ నెరవేరుస్తామని హామీ ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో చింతకాని ఎంపీటీసీ, మహిళ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఉడుముల విజయ రెడ్డి,ఐదు మండలాల విఓఏ లు పాల్గొన్నారు.