Saturday, July 27, 2024
Homeతెలంగాణఐకేపి, వీఓఏ ల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు

ఐకేపి, వీఓఏ ల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు

ఐకేపి, వీఓఏ ల నిరవధిక సమ్మెకు సంఘీభావం తెలిపిన కాంగ్రెస్ నాయకులు

మంథని మే 17(కలం శ్రీ న్యూస్):మంథని ఎమ్మార్వో కార్యాలయం ముందు ఐకేపి, వీఓఏ ఉద్యోగులు చేస్తున్న నిరవధిక సమ్మెకు ఏఐసీసీ కార్యదర్శి మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు ఆదేశాల మేరకు బుధవారం మంథని మండల కాంగ్రెస్ పార్టీ సేగ్గం రాజేష్ ఆధ్వర్యంలో సంఘీభావం తెలియజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రావడం కోసం అన్ని వర్గాల ప్రజలు ఉద్యోగస్తులు ఎంతోమంది పోరాటం చేశారు.తెలంగాణ వస్తే ఔట్సోర్సింగ్ విధానమే ఉండదని ధర్నాలు సమ్మెలు చేసే పరిస్థితి ఉండదు అని చెప్పిన కెసిఆర్ కేవలం మాటల వరకే పరిమితమైంది. రూ 26000 గౌరవ వేతనం ఇచ్చి వివో ల సమస్యలు పరిష్కారం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో పెరవేణి లింగయ్య యాదవ్, నూకల బాణయ్య,మంథని సత్యం, రావి కంటి సతీష్,కుడుదుల వెంకన్న, ఊదరి శంకర్, రాం రాజశేఖర్, మంథని రాకేష్, వేల్పుల రాజు, కోటరి బాపు, పెంటరి రాజు,మంథని శ్రీనివాస్, ఆర్ల నాగరాజు,ఎరుకల ప్రవీణ్,పెరుగు తేజ, బండారి తిరుపతి,ప్రసాద్, దొరగొర్ల శ్రీనివాస్ యాదవ్, తాళ్ల పెల్లి సత్యనారాయణ గౌడ్,పొనగంటి రమేష్, రాం మూర్తి, రోడ్డ రాజేశ్వరావు, పొరాండ్ల రంజిత్, కేక్కర్ల సందిఫ్, పార్వతి కిరణ్,బడికల మనోజ్, ఇందారపు అనిల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!