Saturday, July 27, 2024
Homeతెలంగాణప్రజల ప్రాణాలతో అధికారుల చెలగాటాలు...

ప్రజల ప్రాణాలతో అధికారుల చెలగాటాలు…

ప్రజల ప్రాణాలతో అధికారుల చెలగాటాలు…

బారాస నాయకులు పురం రమణ

సుల్తానాబాద్,మే12(కలం శ్రీ న్యూస్):సుల్తానాబాద్ పట్టణంలోని పూసాల రోడ్ లోని గౌస్ పాషా చికెన్ సెంటర్ లో దుర్గంధంతో, దుర్వాసనతో చుట్టుపక్కల వ్యాపారులు నివాస ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతూ అనారోగ్యానికి గురవుతూ ఉన్న సమస్యను మున్సిపల్ కమిషనర్ కు గురువారం ఫిర్యాదు చేయగా వెంటనే స్పందించి సీజ్ చేసినట్టు ప్రకటించారు కమిషనర్ రాజశేఖర్. ఇక్కడ ఇంత వరకు బాగానే ఉంది. మున్సిపల్ కమిషనర్ సీజ్ చేశారు. ఇకపై దుర్గంధం, దుర్వాసన రాదు అని ఈ ప్రాంత ప్రజలు భావించారు. కానీ ఒక గంట వ్యవధిలోనే యధావిధిగా చికెన్ సెంటర్ నడుపుతూ దుర్వాసన, దుర్గంధంతో నిండుకొని ఉన్న సమస్యను అలాగనే పెట్టి చికెన్ సెంటర్ నిర్వహించడం తీరుపై అధికారులు వ్యవహరించిన తీరుకు సుల్తానాబాద్ పట్టణంలో చర్చ అంశంగా మారింది. చికెన్ సెంటర్ ను సీజ్ చేస్తే ఒక గంటలోపే ఓపెన్ చేసి నడుపుకునే పరిస్థితులు ఉన్నాయంటే అధికారుల చర్యలు ఏ మేరకు కొనసాగుతున్నాయో ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. ప్రజల ఆరోగ్యం, ప్రజల ప్రాణాలు మున్సిపల్ అధికారులకు అవసరం లేదా అని ప్రజలు చర్చించుకుంటున్నారు. గంట వ్యవధిలోనే అనుమతులను ఏ మేరకు ఇస్తారు, ఇచ్చారు…..? అనేది ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.ఎది ఏమైనా ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని బారాస నాయకులు పురం రమణ డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!