Saturday, July 27, 2024
Homeతెలంగాణరైతు సమస్యల పరిష్కారానికి కృషి :సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

రైతు సమస్యల పరిష్కారానికి కృషి :సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

రైతు సమస్యల పరిష్కారానికి కృషి :సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్

మంథని మే 11(కలం శ్రీ న్యూస్):రైతు సమస్యల పరిష్కారానికి తమవంతు కృషి చేస్తామ ని మంథని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్ అన్నారు. అకాల వర్షాల నేపథ్యంలో రైతులకు మిల్లర్ల వల్ల కలుగుతున్న ఇబ్బందులపై సింగిల్ విండో చైర్మన్ల ఫోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు ముత్యాల బలరామరెడ్డి ఆధ్వర్యంలో గురువారం పెద్దపల్లి జిల్లా కలెక్టర్, జిల్లా జాయింట్ కలెక్టర్, జిల్లా సహకార అధికారికి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సింగిల్విండో చైర్మన్ల పోరం పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు బలరామరెడ్డి, మంథని సింగిల్విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, పలువురు సింగిల్విండో చైర్మన్లు మాట్లాడారు. అకాల వర్షాలకు ధాన్యం తడిసి రైతన్నలు అష్టకష్టాలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తడిసిన ధాన్యాన్ని మాశ్చర్ తో సంబంధం లేకుండా ఎలాంటి కోతలు విధించకుండా త్వరితగతిన రైస్ మిల్లర్లు దించుకునేలా చూడాలని, లారీ కాంట్రాక్టర్లు లారీలు సకాలంలో కేంద్రాలకు పంపించాలని, హమాలీలు కూడా సహకరించేలా జిల్లా కలెక్టర్, డిసిఓ, జిల్లా ఉన్నతాధికారులు తగు చర్యలు చేపట్టాలని వారు కోరారు. రైతులకు ఎలాంటి కష్టం రాకుండా అన్నదాతకు సింగిల్విండో చైర్మన్లు, పాలకవర్గాలు అండగా ఉంటాయని భరోసా ఇచ్చారు. అదేవిధంగా పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్ కు కూడా ఇట్టి సమస్యను విన్నవించగా సమస్య పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ముత్తారం, సుల్తానాబాద్, కమాన్ పూర్, కన్నాల, పెద్దపల్లి సింగిల్విండో చైర్మన్లు గుజ్జుల రాజిరెడ్డి, శ్రీగిరి శ్రీనివాస్, ఇనగంటి భాస్కర్ రావు, బయ్యపు మనోహర్ రెడ్డి, నర్సింహారెడ్డి, పలువురు సింగిల్విండో చైర్మన్లు, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!