Saturday, July 27, 2024
Homeతెలంగాణమంథనిలో డయాలసిస్‌ సెంటర్‌ మంజూరు హర్షణీయం

మంథనిలో డయాలసిస్‌ సెంటర్‌ మంజూరు హర్షణీయం

మంథనిలో డయాలసిస్‌ సెంటర్‌ మంజూరు హర్షణీయం

సీఎం కేసిఆర్,మంత్రి హరీష్ రావు ల చిత్రపటానికి పాలాభిషేకం చేసిన బీఆర్‌ఎస్‌ పార్టీశ్రేణులు

మంథని, మే 10(కలం శ్రీ న్యూస్):ప్రజల అవసరాలను గుర్తించి వాటిని తీర్చాలన్నదే బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం,సీఎం కేసీఆర్‌ లక్ష్యమని ఎంపీపీ కొండ శంకర్‌, జెడ్పీటీసీ తగరం సుమలత శంకర్‌లాల్‌ అన్నారు.మంథని ప్రభుత్వ ఆస్పత్రిలో ఐదు పడకల డయాలసిస్‌ సెంటర్‌ మంజూరీ కావడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ బుధవారం ప్రభుత్వ ఆస్పత్రి ఆవరణలో సీఎం కేసీఆర్‌, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు, జెడ్పీ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ అభివృధ్ది విషయంలో ప్రతిపక్షాల మాటకు సీఎం కేసీఆర్‌, బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు. ప్రజల అవసరాలు తీర్చే విషయంలో పక్షమా ప్రతిపక్షమా అనే ఆలోచన లేదన్నారు. ప్రతిపక్షాలు అభివృధ్ది కోసం చేసే ప్రతిప్రతిపాదనను పరిగణలోకి తీసుకునే తత్వం బీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదేనన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ కొండా శంకర్,జడ్పీటీసీ తగరం సుమలత శంకర్ లాల్, పిఏసిఎస్ చైర్మన్ కొత్త శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి అనంతరెడ్డి,మున్సిపల్ కౌన్సిలర్ లు వికే రవి, గర్రెపల్లి సత్యనారాయణ, వేముల లక్మి సమ్మయ్య బీఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!