Saturday, July 27, 2024
Homeతెలంగాణపంచాయతీ కార్యదర్శులను విధుల్లో చేరకపోతే తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తే ఊరు కోనే ప్రసక్తే లేదు..

పంచాయతీ కార్యదర్శులను విధుల్లో చేరకపోతే తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తే ఊరు కోనే ప్రసక్తే లేదు..

పంచాయతీ కార్యదర్శులను విధుల్లో చేరకపోతే తొలగిస్తామని బెదిరింపులకు గురిచేస్తే ఊరు కోనే ప్రసక్తే లేదు..

బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి..

మంథని, మే 9(కలం శ్రీ న్యూస్):జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం లోని ఎంపీడీఓ ఆఫీస్ ముందు 12 రోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్న జూనియర్ పంచాయతీ కార్యదర్శులకు బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి మద్దతు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ జూనియర్ పంచాయతీ కార్యదర్శులను విధుల్లో చేరాక పోతే తొలగిస్తామని బెదిరింపు లకు గురిచేస్తే ఊరు కోనే ప్రసక్తే లేదు, బీజేపీ పార్టీ వారికి అండగా ఉంటుందని భయపడవద్దని, వారి న్యాయమైన డిమాండ్ లని నెరవేర్చలసిందిపోయి ఇలా విధుల్లో కి చేరాకపోతె తొలగిస్తామని బెదిరించడం ఏంటి? గ్రామంలలో వీరి కృషి వల్లే జాతీయ స్థాయిలో 12 అవార్డు లు వచ్చాయి, గతంలో సీఎం కెసిఆర్ ఇచ్చిన హామీలనే వారు అడుగుతున్నారు.ఇప్పటికైనా వారి డిమాండ్ లు నెరవేర్చలని అన్నారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు బొమ్మన భాస్కర్ రెడ్డి, జిల్లా మహిళ మోర్చా ప్రధాన కార్యదర్శి ఉడుముల విజయ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి పూసల రాజేంద్ర ప్రసాద్,గంట అంకయ్య,కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బండం మల్లారెడ్డి, బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి పగే రంజిత్,మహిళ మోర్చా మండల అధ్యక్షురాలు నడిగొట్ట శ్రీవాణి, సీనియర్ నాయకులు దోమల సమ్మయ్య,తోకల బాలయ్య, బొడ్డు శివ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!