Saturday, July 27, 2024
Homeతెలంగాణమంథనిలో గిరిజన బాలికల కళాశాలలో విద్యార్థుల ప్రతిభ

మంథనిలో గిరిజన బాలికల కళాశాలలో విద్యార్థుల ప్రతిభ

మంథనిలో గిరిజన బాలికల కళాశాలలో విద్యార్థుల ప్రతిభ

మంథని, మే 9(కలం శ్రీ న్యూస్): ఇంటర్మీడియట్ పరీక్షల్లో మంథని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులు ప్రతిభను చాటారు.ఎంపీసీ రెండవ సంవత్సరం విద్యార్థిని జి అక్షయ 1000 మార్కులకు 968 మార్కులు సాధించి కళాశాల టాపర్ గా నిలిచారు. బైపిసి రెండవ సంవత్సరంలో పి దివ్య 1000 మార్కులకు 942 మార్కులు సాధించి టాపర్ గా నిలిచారు.

ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఎంపీసీలో B బిందు 470 గాను 428 మార్కులు సాధించగా. బైపిసి మొదటి సంవత్సరంలో ఏ.కావేరి 440 గాను 406 మార్కులు సాధించారు. ఇంటర్ రెండవ సంవత్సరంలో ఈ కళాశాల నుండి 72 మంది పరీక్షలకు హాజరుకాగా 59మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో47 విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 32 మంది ఉత్తీర్ణత సాధించారు.ఈ జూనియర్ కళాశాల నుండి 82% ఉత్తీర్ణత సాధించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!