Wednesday, November 29, 2023
Homeతెలంగాణఇండ్ల మద్యలో గోవధ శాల.... చోద్యం చూస్తున్న మున్సిపాలిటీ పాలక వర్గం.

ఇండ్ల మద్యలో గోవధ శాల…. చోద్యం చూస్తున్న మున్సిపాలిటీ పాలక వర్గం.

ఇండ్ల మద్యలో గోవధ శాల…. చోద్యం చూస్తున్న మున్సిపాలిటీ పాలక వర్గం.

మంథని మే 2(కలం శ్రీ న్యూస్ ):మంథని మున్సిపాలిటీ పరిధిలోని 3 వ వార్డ్ అంబేద్కర్ నగర్ లో రోజు ఉదయమే పశువులను వదిస్తూ అమ్ముతున్నారు.వీటి వ్యర్థాలు కూడా అక్కడే పడేస్తున్నారు. దీని ద్వారా ఇక్కడ నివసించే వారికి చాలా దుర్వాసన వస్తుంది, కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి.విపరీత మైన దోమలతో విష జ్వరాల భారిన పడి పిల్లలు, వృద్దులు అనేక ఇబ్బందులకు గురి అవుతున్నారు.కాబట్టి వెంటనే మున్సిపాలిటీ పాలక వర్గం, అధికారులు స్పందించి ఇండ్ల మద్యలో వున్న గోవధ శాలను తరలించాలని కోరుతు బిజెపి నాయకులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు ఎడ్ల సదశివ్,పట్టణ ప్రధాన కార్యదర్శి సబ్బని సంతోష్, మంథని అసెంబ్లీ కో కన్వీనర్ నాంపల్లి రమేష్, జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి బోయిని నారాయణ,సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్, పోతరవేణి క్రాంతి , బూడిద తిరుపతి, దాసరి శ్రావణ్ , కాసర్ల సూర్య ,పార్వతి విష్ణు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!