అకాల వర్షాలకు అపార నష్టం
–గ్రామాలలో పంట పొలాలను పరిశీలించిన ఏ ఈ ఓ ఫిరోజ్, వినోద్..
వెల్గటూర్, మే02 (కలం శ్రీ న్యూస్): జగిత్యాల జిల్లా వెల్గటూర్, ఎండపల్లి మండలల్లో ఆదివారం కురిసిన అకాల వర్షానికి, ఈదూరు గాలులకు దెబ్బతిన్న మొక్క జొన్న, నువ్వు , వరి పంట పొలాలను వ్యవసాయ శాఖ ఆదేశాల మేరకు ఏ ఈ ఓ ఫిరోజ్, వినోద్ లు క్షేత్ర స్థాయిలో సోమవారం పరిశీలించారు. గోడిశలపేట్ , క్లష్టర్ గ్రామాలైన ముంజంపల్లి, మారేడుపల్లి, ఉండేడ, శానబండతో పాటు చేగ్యాం క్లస్టర్ సంబంధిత గ్రామలైనా చెగ్యాం, రాంనూర్, ముత్తునూర్, పైడిపల్లి, సంకెనపల్లి, కిషన్ రావ్ పేట్ గ్రామలలో పంటలు నష్టం జరిగిందని తెలిపారు. పి పి సి సెంటర్ లలో పోసిన వడ్లు సైతం వర్షానికి కొట్టుకొని పోవడం జరిగిందని పేర్కొన్నారు. గ్రామాలలో పంటలకు నష్టం జరిగినట్టు ప్రాథమిక అంచనా వేయడం జరిగినదని తెలిపారు. నష్టం జరిగిన వివరాల నివేదికను పై అధికారులకు పంపడం జరిగిందని అన్నారు.