నిధుల దుర్వినియోగం పై డి.ఎల్.పి.ఓ విచారణ
ఎండపల్లి, మే 01 (కలం శ్రీ న్యూస్):రాజరాంపల్లి గ్రామపంచాయతీలో నిధుల దుర్వినియోగంపై స్థానిక ఎంపీటీసీ గాజుల మల్లేశం కలెక్టర్ కు చేసిన ఫిర్యాదు ఆధారంగా డిఎల్పివో కనకదుర్గ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయం లో అభియోగాల పై విచారణ జరిపి ఇరుపక్షాల వాదనలు విన్నారు.రికార్డులను తనిఖీ నిర్వహించి సీజ్ చేశారు.ఈ సందర్బంగా డిఎల్పిఓ కనకదుర్గ మాట్లాడుతూ పూర్తి స్థాయిలో విచారణ జరిపి నివేదికను కలెక్టర్ కు సమర్పిస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎంపివో శ్రీనివాస్, సర్పంచ్ గేల్లు శేఖర్, వార్డు సభ్యులు అమ్ముల నరేష్,భూపతి తిరుపతి,గోపినేని గంగా చలం, గ్రామస్థులు మంతెన సతీష్, గాజుల విజయ్ తదితరులు పాల్గొన్నారు.