Sunday, September 8, 2024
Homeతెలంగాణకనుకుంట్ల వైష్ణవి కి డాక్టరేట్.

కనుకుంట్ల వైష్ణవి కి డాక్టరేట్.

కనుకుంట్ల వైష్ణవి కి డాక్టరేట్.

కరీంనగర్,ఎప్రిల్13(కలం శ్రీ న్యూస్):

శాతవాహన విశ్వవిద్యాలయం నుండి కనుకుంట్ల వైష్ణవికి బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో పీ.హెచ్.డి అందజేసినట్లు విశ్వవిద్యాలయం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ తెలిపారు. ప్రొఫెసర్ టి. భరత్ ఆధ్వర్యంలో పర్ఫామెన్స్ ఆఫ్ ప్రైమరీ అగ్రికల్చరల్ కో-ఆపరేటివ్ సొసైటీస్ ఆఫ్టర్ రేకాప్టిలైజేషన్ అసిస్టెన్స్ ఏ స్టడీ విత్ స్పెషల్ రెఫరెన్స్ టు కరీంనగర్ పై చేసిన పరిశోధనకు గాను బిజినెస్ మేనేజ్మెంట్ విభాగంలో వైష్ణవికి డాక్టరేట్ లభించింది. ఈ సందర్భంగా కనుకుంట్ల వైష్ణవి కి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్.మల్లేశం, రిజిస్టార్ వరప్రసాద్, బోర్డు ఆఫ్ స్టడీస్ శ్రీరంగ ప్రసాద్, ప్రిన్సిపల్ ఆఫ్ కామర్స్, బిజినెస్ మేనేజ్మెంట్ హరికాంత్, హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ మనోహర్, విశ్వవిద్యాలయ అధ్యాపకులు తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!