పట్టణ సుందరీకరణపై ప్రత్యేక దృష్టి
ఆహ్లదం పంచేలా అభివృద్ది పనులు
జెడ్పీ చైర్మన్ పుట్ట మధూకర్
బుల్లెట్ బండిపై మంథనిలో విస్తృత పర్యటన
మంథని,ఎప్రిల్11(కలం శ్రీ న్యూస్): జిల్లాలోనే మంథని పట్టణాన్ని అన్నివిధాలుగా అభివృధ్ది చేస్తూ పట్టణ సుందరీకరణపై ప్రత్యేక దృష్టిసారించినట్లు జిల్లా పరిషత్ చైర్మన్ పుట్టమధూకర్ తెలిపారు.
బుల్లెట్ బండిపై మంథనిపట్టణంలో విస్తృత పర్యటన చేపట్టారు.మున్సిపల్ పరిధిలోని రావుల చెరువు కట్ట, తమ్మిచెరువు కట్ట, బొక్కలవాగు కట్ట సుందరీకరణలో బాగంగా జరుగుతున్న సీసీ రోడ్డు, వాకింగ్ ట్రాక్, లైటింగ్ పనులతో పాటు రజకవాడ నుంచి రావులచెరువుకట్ట ప్రాంతంలోని శివకిరణ్ గార్డెన్ వరకు రహాదారి నిర్మాణం కోసం ఆయన పరిశీలన చేశారు. అలాగే మంథని బస్టాండ్ ఎదురుగా ఉన్న దుకాణ సముదాయ భవనంపై అంతస్తు నిర్మాణం కోసం పరిశీలన చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మంత్రపురిగా పేరుగాంచిన మంథని ప్రజలకు ఆహ్లదం పంచేలా అభివృద్ది పనులు జరుగుతున్నాయని, పట్టణానికి చెందిన ఎంతో మంది ఇతర ప్రాంతాల్లో ఉంటారని, అలాంటి వారు మంథనికి వస్తే మంచి ఆహ్లాదరకమైన వాతావరణం కల్పించాలనే ఆలోచనతో ముందుకు సాగుతున్నామన్నారు. మంథనిని మరో కోనసీమ తరహాలో అభివృధ్ది చేయాలనే ఆకాంక్షతో ఉన్నామని, ఈ క్రమంలోఅనేక అభివృధ్ది పనులకు శ్రీకారం చుట్టినట్లు ఆయన వివరించారు. కాగా విస్తృత పర్యటనలో బాగంగా ఆయా వాడల్లోని వృద్దులను, ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. సుమారు రెండు గంటల పాటు బుల్లెట్ బండిపై మంథని పట్టణంలోని పలు ప్రాంతాల్లో పర్యటించారు.