Saturday, July 27, 2024
Homeతెలంగాణమానవాళి మనుగడ కాపాడేలా కృషి చేయాలి

మానవాళి మనుగడ కాపాడేలా కృషి చేయాలి

మానవాళి మనుగడ కాపాడేలా కృషి చేయాలి

జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌

మంథని, ఏప్రిల్ 8(కలం శ్రీ న్యూస్ ):ఏ మతం వారైనా మానవాళి మనుగడను కాపాడేలా,యువతరం చెడుమార్గాల్లో నడవకుండా కృషి చేయాలని జిల్లా పరిషత్‌ చైర్మన్‌ పుట్ట మధూకర్‌ అన్నారు.

యేసుక్రీస్తు చనిపోయిన దినం పురస్కరించుకుని కమాన్‌పూర్‌ ఎక్స్‌ రోడ్‌ నుంచి బేగంపేట ఎక్స్‌రోడ్‌ వరకు యూపీఎఫ్‌ పాస్టర్‌ల ఆధ్వర్యంలో చేపట్టిన రన్‌ ఫర్‌ జీసెస్‌ శాంతి ర్యాలీలో పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్మన్ పుట్ట మధూకర్ పాల్గొని మాట్లాడుతూ యేసుక్రీస్తు జననం,మరణం ఎంతో గొప్పదన్నారు. యేసు ప్రభువు సిలువ వేయబడి చనిపోయిన రోజుగా ప్రజలను రక్షించుకోవడానికి ఆదివారం ఆయన తిరిగి లేచిన రోజుగా యేసు విశ్వాసకులు మాకు దేవుడున్నాడనే నమ్మకంతో ఘనంగా జరుపుకుంటారన్నారు. క్రిష్టియన్‌లో మదర్‌థెరిస్సాలాంటి గొప్ప సేవకులు ఎంతో మంది ఉన్నారన్నారు. కుష్టు రోగులను, ఎయిడ్స్‌ వ్యాధిగ్రస్తులను ముద్దాడిన మతం క్రీస్తుమతంగా దేశంలో చూశామన్నారు. మంచిని ప్రేమించేలా సాటి మనిషిని గౌరవించే తత్వం అలవర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. యేసుక్రీస్తు దీవెనలు పాస్టర్‌లు, విశ్వాసకులపై ఉండాలని ఆయన ఆకాంక్షించారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!