Saturday, July 27, 2024
Homeతెలంగాణఎండపల్లి మండల కేంద్రం లో బండి సంజయ్ దిష్టి బొమ్మ దహణం

ఎండపల్లి మండల కేంద్రం లో బండి సంజయ్ దిష్టి బొమ్మ దహణం

ఎండపల్లి మండల కేంద్రం లో బండి సంజయ్ దిష్టి బొమ్మ దహణం

జగిత్యాల ఎప్రిల్ 6(కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా ఎండపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సింహాచలం జగన్ ఆధ్వర్యంలో ప్రధాని మోడీ, బండి సంజయ్ ల దిష్టి బొమ్మలను దగ్ధం చేశారు.

పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీకి కారకుడై భావి భారత పిల్లల భవిష్యత్తును విచ్చినం చేసే ఉద్దేశంతో ప్రశ్న పత్రాల లీక్ చేయించిన బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం చేశారు.

ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక వైపు చదువుకునే పిల్లల భవిష్యత్తు కోసం ఎన్నో గురుకుల పాఠశాలలు, రెసిడెన్షియల్ పాఠశాలలు, నెలకొల్పి ఉత్తమ విద్యను అందిస్తూ వారి భవిష్యత్తుకు బంగారి బాటలు వేసే దిశగా ఎన్నో సంక్షేమ పథకాలు, కార్యక్రమాలు చేస్తుంటే పిల్లల భవిష్యత్తును నిర్వీర్యం చేస్తున్న బండి సంజయ్ పిల్లల భవిష్యత్తు తో ఆడుకోకూడదని హెచ్చరిక చేస్తూ దిష్టిబొమ్మ దహనం చేశారు.

ఈ కార్యక్రమంలో భారాస పార్టీ ఎండపల్లి అధ్యక్షుడు సింహాచలం జగన్, ఎండపల్లి సర్పంచ్ మారం జలంధర్ రెడ్డి, కోఆప్షన్ సభ్యులు ఎండి రియాజ్, ఉప సర్పంచ్ మైలారపు సతీష్, మారం జగన్మోహన్ రెడ్డి, మండల కార్యదర్శి పడిదం వెంకటేష్, దుర్గం శ్రీనివాస్, పసుపునూటి అనిల్, మాదాసు గంగాధర్, మంతెన రాజు, నాగరాజు, ప్రశాంత్, శ్రవణ్, మల్లేష్, నరసయ్య ,రాజేశం, అనిల్, క్రాంతి, తిరుపతి, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!