Wednesday, November 29, 2023
Homeతెలంగాణసామాజిక సాహిత్యం.. స్వర్ణ కిరీటం కొండేల మారుతి

సామాజిక సాహిత్యం.. స్వర్ణ కిరీటం కొండేల మారుతి

సామాజిక సాహిత్యం.. స్వర్ణ కిరీటం కొండేల మారుతి

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్

మంథని మార్చి 23(కలం శ్రీ న్యూస్): సమాజ శ్రేయస్సు కాంక్షించే సాహిత్యం స్వర్ణ కిరీటం లా చరిత్రలో నిలుస్తోందని మంత్రపురి సాహిత్య సౌధిష్ఠం వ్యవస్థాపక అధ్యక్షుడు కొండేల మారుతి అన్నారు. శ్రీ శోభకృత్ ఉగాది పురస్కరించుకుని బుధవారం రాత్రి సమ్మేళనం జరిగింది.ఈ సందర్భంగా ప్రసంగించిన రచయితలు కవులు తమ నివేదన పూర్వక సమాజ హితం..ప్రకృతి పరమైన పర్వదినాలు రూపేణా స్వీయ రచనలు వినిపించారు.ఉగాది ఉశస్సు తెలుగు వారి తేజస్సు పతాక గా మేడగోని రాజమౌళి గౌడ్,రామడుగు మారుతి,సతీదేవి లోకే ఇత్యాదుల అక్షర గీతీకలను రావికంటి మనోహర్,రాజశేఖర్ గౌడ్,సతీదేవి గాత్ర ప్రదానం చేసారు. ఈ కార్యక్రమంలో శాలువలు మెమేంటోలు ప్రశంసా పత్రాలతో విజయోస్తు మహిళా అధ్యక్షురాలు కొండేల శ్యామల ను సత్కరించారు. మంథని విద్యార్థి యువత కార్యాలయంలో నిర్వహించిన కవి సమ్మేళనం నకు కొండేల మారుతి వ్యవహర్త గా కొనసాగారు..

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!