Saturday, July 27, 2024
Homeతెలంగాణమున్సిపల్ కౌన్సిల్ సభ్యుల తో సాధారణ సమావేశం

మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల తో సాధారణ సమావేశం

మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల తో సాధారణ సమావేశం

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్

మంథని మార్చి 23(కలం శ్రీ న్యూస్):మంథని పట్టణంలోనీ మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ అధ్యక్షతన కౌన్సిల్ సభ్యులతో సాధారణ సమావేశ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమములో మంథని మున్సిపాలిటీకి అవసరమగు అంశాలను కౌన్సిల్ సభ్యులతో చర్చించి ఆమోదం తీసుకున్నారు.మంథని పురపాలక సంఘం పరిధిలోని ఇం. నెం. 11-97 నుండి 11-97/1 ఇంటి వరకు సి.సి రోడ్డు నిర్మాణం గురించి,మంథని పురపాలక సంఘం పరిధిలోని ఇం. నెం. 11-42/బి నుండి 11-39/ఏ ఇంటి వరకు సి.సి రోడ్డు నిర్మాణం గురించి,మంథని పురపాలక సంఘం పరిధిలోని ఇం. నెం. 11-38 నుండి11-38/బి ఇంటి వరకు సి.సి రోడ్డు నిర్మాణం గురించి,మంథని పురపాలక సంఘం పరిధిలోని ఇం.నెం. 12-102 నుండి12-101/ఏ ఇంటి వరకు సైడ్ డ్రైన్ నిర్మాణం గురించి,దళిత బహుజన వర్గాల కోసం కృషిచేసి బిసీ రిజర్వేషన్ల పై పోరాడిన సంఘ సంస్కర్త,మండల కమిషన్ చైర్మన్,బీహార్ మాజీ ముఖ్యమంత్రి, బిందేశ్వరా ప్రసాద్ (బి.పి) మండల్ విగ్రహ ఏర్పాటుకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదించారు.మంథని నియోజక వర్గ ప్రథమ శాసన సభ్యులు గులుకోట శ్రీరాములు (సోషలిస్ట్ పార్టీ సం.1952) విగ్రహాన్ని ఏర్పాటు చేయుటకు మున్సిపల్ కౌన్సిల్ సభ్యుల ఆమోదించారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కమిషనర్ యూ. శారద, మున్సిపల్ వైస్ చైర్మన్ ఆరెపల్లి కుమార్, కౌన్సిలర్లు వి కె రవి,కాయితి సమ్మయ్య,సీపతి బాణయ్య, కుర్ర లింగయ్య, నక్క నాగేంద్ర శంకర్, వేముల లక్ష్మి సమ్మయ్య,కో ఆప్షన్ సభ్యులు అంకరి పద్మజ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!