అనాథ యువతి వివాహానికి ఆర్థిక సహాయం పంపిన మంత్రి కొప్పుల ఈశ్వర్
జగిత్యాల రిపోర్టర్/ నాగసముద్రాల శ్రీనివాస్ విశ్వకర్మ
జగిత్యాల, మార్చి 21(కలం శ్రీ న్యూస్):సమాజ సేవ, పేద ప్రజల ఇబ్బందులను తీర్చడంలో కలిగే తృప్తి మరెందులో లేదని భావించిన తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్గటూరు మండలం లోని జగదేవుపేట గ్రామానికి చెందిన అనాధ ఆడపడుచు పెళ్లి కి సోమవారం రోజున పది వెయిల రూపాయల ఆర్థిక సహాయాన్ని పంపించి ఉదారతను చాటారు. జగదేవుపేట గ్రామానికి చెందిన గ్రామంలోని సహస్ర తండ్రిని చిన్న తనంలోనే కోల్పోయింది. నిరుపేద కుటుంబానికి చెందిన సహస్ర వివాహం క్యాతం దినకర్ తో జరగగా గ్రామ సర్పంచ్ గాగిరెడ్డి లింగమ్మ రాజేశ్వర్ రెడ్డిల ద్వారా సమాచారం అందుకున్న రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ స్పందించి సహస్ర వివాహానికి పది వెయిల రూపాయల ఆర్థిక సహాయాన్ని ప్రజా ప్రతినిధుల ద్వారా వారి కుటుంబానికి అందజేశారు.
ఈ సందర్భంగా సహస్ర కుటుంబ సభ్యులు మంత్రి కొప్పుల ఈశ్వర్ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగదేవుపేట సర్పంచ్ గాగిరెడ్డి లింగమ్మ రాజేశ్వర్ రెడ్డి, ఎంపీపీ కూనమల్ల లక్ష్మి లింగయ్య, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పత్తిపాక వెంకటేష్, గ్రామ శాఖ అధ్యక్షుడు లక్కాకుల వేణు, సలాది ప్రభు కుమార్, మల్లారెడ్డి, లక్ష్మణ్, తదితరులు పాల్గొన్నారు.