Saturday, July 27, 2024
Homeతెలంగాణటిఎస్ పిఎస్ సి అక్రమాలపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి దోషులను కఠినంగా శిక్షించాలి 

టిఎస్ పిఎస్ సి అక్రమాలపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి దోషులను కఠినంగా శిక్షించాలి 

టిఎస్ పిఎస్ సి అక్రమాలపై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి దోషులను కఠినంగా శిక్షించాలి 

అంబేద్కర్ చౌరస్తా లో నిరసన దీక్ష చేపట్టిన మంథని బీజేపీ పార్టీ నాయకులు

మంథని రిపోర్టర్/ నాంపల్లి శ్రీనివాస్

మంథని మార్చి 20(కలం శ్రీ న్యూస్ ):మంథని పట్టణంలో బీజేపీ రాష్ట్ర నాయకులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సూచనల మేరకు అంబేద్కర్ చౌక్ లో ఇటీవల టిఎస్ పిఎస్ సి పేపర్ లీకేజీ పై సిట్టింగ్ జడ్జ్ తో విచారణ చేపించి దోషులను కఠినంగా శిక్షించాలని నిరసన దీక్ష చేపట్టరు. అనంతరం బీజేపీ పట్టణ అధ్యక్షులు,ఎడ్ల సదశివ్, ప్రధాన కార్యదర్శి సబ్బాని సంతోష్ మాట్లాడుతూ బాధ్యులైన కే టి ఆర్,విద్యాశాఖ మంత్రి ని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు నైతిక బాధ్యత వహించి సీఎం కెసిఆర్ రాజీనామా చెయ్యలి.11 ఏళ్ళు నిరుద్యోగుల కళను నిరుగార్చారు.కేసీఆర్ విద్యార్థుల కళ్ళలో మట్టి కొట్టారు.ఒక్కో విద్యార్థి కోచింగ్ సెంటర్లలో లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు.అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దు తెలంగాణ యువత బరిగీసి కొట్లాడాలి.పెన్ డ్రైవ్ లో పేపర్లు దొంగిలిస్తే టిఎస్ పిఎస్ సి ఎంచేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో బూత్ సశక్తి కరన్ అభియాన్ నియోజకవర్గ ఇంచార్జ్ చిలువేరి సతీష్,మండల ప్రధాన కార్యదర్శులు వీరబోయిన రాజేందర్, తోట మధుకర్, ఉప అధ్యక్షులు బూడిద రాజు,రేపాక శంకర్, సీనియర్ నాయకులు బోగోజు శ్రీనివాస్,రాపర్తి సంతోష్, పోతారవేణి క్రాంతికుమార్, తోట్ల రాజు, చాంద్ పాషా,కంచు మల్లేష్, రెప్పాల శంకర్, బొసెల్లి శంకర్, మౌనిక, తోటపల్లి లక్ష్మణ్, సబ్బాని రాజేష్, నరమల శంకర్, మెరుగు శ్రీకాంత్, కాయితి ప్రభాకర్,తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!