Saturday, July 27, 2024
Homeతెలంగాణఢిల్లీ లో వైఎస్సార్ టీపీ ఆందోళన కార్యక్రమానికి ఇంచార్జ్ జాడి ప్రేమ్ సాగర్ నేత

ఢిల్లీ లో వైఎస్సార్ టీపీ ఆందోళన కార్యక్రమానికి ఇంచార్జ్ జాడి ప్రేమ్ సాగర్ నేత

ఢిల్లీ లో వైఎస్సార్ టీపీ ఆందోళన కార్యక్రమానికి ఇంచార్జ్ జాడి ప్రేమ్ సాగర్ నేత

జగిత్యాల రిపోర్టర్/ నాగసముద్రాల శ్రీనివాస్ విశ్వకర్మ

జగిత్యాల, మార్చి15 (కలం శ్రీ న్యూస్):వైఎస్సార్ తెలంగాణ పార్టీ రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షురాలు వైఎస్సార్ షర్మిల ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం పై జరిగిన అవినీతి పై, కేసిఆర్ చేస్తున్న అవినీతి పాలనను నిరసిస్తూ బుధవారం రోజున న్యూ ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద జరిగిన ధర్నా లో పాల్గొన్న ధర్మపురి నియోజకవర్గ వైఎస్ఆర్ టీపీ ఇంచార్జ్ జాడి ప్రేమ్ సాగర్ నేత. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆందోళన చేపట్టారు.

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందని, దీనిపై సీబీఐ, ఈడీలతో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతిపై విచారించాలని కోరారు.

ఈ సందర్భంగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ నాయకులు, కార్యకర్తలు నినాదాలతో హోరెత్తించారు. ‘కేసీఆర్ హఠావో తెలంగాణ బచావో’ అంటూ నినాదాలు చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్ వేల కోట్ల కమీషన్లు దండుకున్నారని వైఎస్ షర్మిల ఆరోపించారు. రీ డిజైనింగ్ పేరుతో కాళేశ్వరం ప్రాజెక్టును మూడు రెట్లు వ్యయం పెంచారని చెప్పారు. కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని మరోసారి ఆరోపించారు.కాళేశ్వరం ప్రాజెక్టు దేశంలోనే అతిపెద్ద స్కామ్ అని వైఎస్ షర్మిల ఆరోపించారు. ప్రజల సొమ్ము లక్షల కోట్లను కేసీఆర్ దోచుకున్నారని ఆరోపించారు. ముప్పై ఎనిమిది వేల కోట్ల ప్రాజెక్టును ఒక లక్ష యాబై వేల కోట్లకు పెంచారని చెప్పారు. మూడు సార్లు ప్రాజెక్టు నిర్మాణ వ్యయాన్ని పెంచారన్నారు. ప్రాజెక్టు వల్ల చాలా మంది నిరాశ్రులయ్యారని, వారికి ఇప్పటి వరకూ రాష్ట్ర ప్రభుత్వం న్యాయం చేయలేదని వైఎస్ షర్మిల అన్నారు. నాణ్యత లేకుండా ప్రాజెక్టు కట్టారని, ప్రతి ఏటా వేల ఎకరాల పంట పొలాలు మునిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక అద్భుతమంటూ కేసీఆర్ తెలంగాణతో పాటు దేశ ప్రజలను సైతం మోసం చేశారని మండిపడ్డారు. ప్రాజెక్టు నిర్మాణంలో డెబ్బై వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందనీ, టూ జీ, బొగ్గు కుంభకోణం కంటే…ఇది పెద్ద స్కామ్ అని ఆరోపించారు. ప్రాజెక్టు రీ డిజైనింగ్ పేరుతో లక్షా ఇరవై వేల కోట్ల ఖర్చుతో కేవలం పద్దెనిమిది లక్షల ఇరవై ఐదు వేల ఏడు వందల ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇచ్చేలా నిర్మించారని వైఎస్ షర్మిల చెప్పారు. ఇంత ఖర్చు చేసి కేవలం లక్షా యాభై వేల ఎకరాలకు మాత్రమే కాళేశ్వరం ద్వారా నీళ్లు ఇచ్చారని చెప్పారు. పంప్ హౌజ్ ల ఎత్తు కూడా చూసుకోకుండా కట్టారని, నాసిరకం పనులు చేశారని ఆరోపించారు. నిర్మాణ పనులపై ఆడిట్ జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కాళేశ్వరం నీళ్లను ఎత్తిపోయడానికే పవర్ బిల్ మూడు వేల కోట్లు ఖర్చయిందని, లోన్లకు వడ్డీలే పదమూడు వేల కోట్లు కడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రంలో జగిత్యాల ఇంచార్జి కాముని గంగాధర్ కూడా పాల్గొన్నారు.

RELATED ARTICLES

Most Popular

error: Content is protected !!