క్రీడలు మానసిక ఉల్లాసానికి దోహదపడుతాయి
మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ
మంథని మార్చి10(కలం శ్రీ న్యూస్ ):క్రీడలు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనడం మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తాయని మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పుట్ట శైలజ అన్నారు.శుక్రవారం మంథని పట్టణంలోని ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో నిర్వహించిన క్రీడా, సాంస్కృతిక వార్షికోత్సవ వేడుకల్లో పాల్గొని ఆమె ప్రసంగించారు.విద్యార్థిని విద్యార్థుల దైనందిన జీవితంలో క్రీడలు ఒక భాగంగా అలవర్చుకోవాలని ఆమె పేర్కొన్నారు. అనంతరం ఆమె విద్యార్ధులకు బహుమతులు ప్రధానం చేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్, సిబ్బంది, విద్యార్థిని- విద్యార్థులు పాల్గొన్నారు.