వ్యవసాయ శాఖ మహిళా మణులను సన్మానించిన సహ ఉద్యోగులు
జగిత్యాల, మార్చి06 ( కలం శ్రీ న్యూస్):జగిత్యాల జిల్లా వెల్గటూరు, ఎండపల్లి మండలాల వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ముందస్తుగా సోమవారంనాడు వెల్గటూరు మండల కేంద్రము లో సహ తోటి మహిళా ఉద్యోగినులను పురుష ఉద్యోగులు సన్మానించారు.
వెల్గటూరు, ఎండపల్లి మండలాల వ్యవసాయ అధికారిని బి.కరుణ శ్రీ, గుల్లకోట, వెల్గటూరు వ్యవసాయ విస్తరణ అధికారినిలు కె. పద్మ, ఎన్.పద్మలను గొడిశెలపేట, శెగ్గ్యాం, కొత్తపేట, క్లస్టర్ల వ్యవసాయ విస్తరణ అధికారులు అయ్యోరి వినోద్, మొహ్మద్ ఫిర్దోస్, అయ్యోరి అజయ్ కుమార్ లు సన్మానించారు.